English | Telugu

Eto Vellipoyindhi Manasu : యాగం ఆపడానికి దుష్టశక్తులు ప్రయత్నం.. మరి అది జరిగేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 204 లో.....యాగం ఆపాలని శ్రీవల్లి, సందీప్, శ్రీలతలు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. శ్రీలత యాగం పనులు చేస్తుంటే.. మాణిక్యం వద్దని అనడం తో మాణిక్యాన్ని రెచ్చగొట్టి యాగం ఆపాలని శ్రీవల్లి అనుకుంటుంది. మాణిక్యంతో మా అత్తయ్యతో అలా అంటావా అని అంటుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. చూడండి బావ గారు అత్తయ్యని అలా అన్నాడంటూ చెప్తుంది.. నేను అలా అనలేదని మాణిక్యం అంటాడు. అప్పుడే స్వామిజీ కలుగుజేసుకుని అలా అంటే తప్పేంటి ఇది పవిత్రమైంది.. అందుకే అందరు ముట్టుకోకుడదు అన్నాడని అనగానే.. అందరు సైలెంట్ అయిపోతారు.

ఆ తర్వాత ఇంకా స్వామి రాలేదని పెద్దాయన అంటాడు. సీతాకాంత్ స్వామికి ఫోన్ చేస్తుంటే కలవదు. తను రాడని తెలిస్తే గుండె ఆగిపోతుందేమోనని శ్రీవల్లి అనుకుంటుంది. ఇక ఇది ఎలా చేస్తావ్ రామలక్ష్మి అని శ్రీలత అనుకుంటుంది. ఆ తర్వాత ఇంకో స్వామి ఫోన్ మాట్లాడుతు.. స్వామికి ఆక్సిడెంట్ అయిందా అంటూ షాక్ అవుతాడు. దాంతో అందరు ఇక యాగం ఆగినట్లేనని టెన్షన్ పడతారు. శ్రీవల్లి, సందీప్, శ్రీలతలు హ్యాపీ గా ఫీల్ అవుతారు.ఇక అంతా దేవుడు దయ అంటూ రామలక్ష్మి సీతాకాంత్ లు మొక్కుకుంటారు. అప్పుడే స్వామి వస్తుంటాడు. అతన్ని చూసి హ్యాపీ గా ఫీల్ అవుతారు. మీకు ఆక్సిడెంట్ అయిందట అని సీతాకాంత్ అంటాడు. చెప్పాను కదా దుష్టశక్తులు యాగం ఆపాలని చూస్తారని అని స్వామి అంటాడు.ఆ తర్వాత యాగాన్ని మొదలుపెడతారు. ఇది నిష్టతో చెయ్యాలి మధ్యలో నీళ్లు కూడా తాగకూడదని స్వామి చెప్తాడు. ఇప్పుడే ఏదైనా తాగండి అని స్వామి చెప్పగానే నేను తీసుకొని వస్తానంటూ సుజాత వెళ్తుంటే నేను వస్తాను అని శ్రీవల్లి వెళ్తుంది. సుజాత కొబ్బరి నీళ్లు గ్లాస్ లో పోస్తుంది. అందులో శ్రీవల్లి మత్తు టాబ్లెట్ కలుపుతుంది. ఆ నీళ్లు తీసుకొని వచ్చి ఇస్తారు. రామలక్ష్మి ఆ వాటర్ తాగుతుంది.

ఆ తర్వాత యాగం మొదలవుతుంది. పంతులు మంత్రాలు చదువుతుంటాడు. ఆ తర్వాత మాణిక్యం పూజ సామాగ్రి తెస్తుంటే కింద పడిపోతాడు. తాగి వస్తే ఇలాగే ఉంటుందంటూ శ్రీవల్లి గొడవ చేయగా.. తాగి రాలేదని మాణిక్యం అంటాడు. తాగి రాలేదు, తాగి వస్తే ఎలా ఉంటాడు నాకు తెలుసని సీతాకంత్ అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి మత్తుగా అనిపిస్తుంది. మత్తు పని చేస్తున్నట్లు ఉందని శ్రీవల్లికి శ్రీవల్లి చెప్తుంది. రామలక్ష్మి మత్తులో సీతాకాంత్ పై పడిపోతుంది. ఇదంతా యాగం ఆగడానికి దుష్టశక్తలు చేస్తుంది. మీరు వేదమంత్రాలూ చదవండి ఆపకండి అని స్వామి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.