English | Telugu

అత్యధిక ఫాలోయింగ్ తో నెంబర్ వన్ స్థానంలో కామన్ మ్యాన్

బిగ్ బాస్ సీజన్-7 లో మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఉండగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్. వ్యవసాయం వ్యవసాయాధారిత కుటుంబంలో పుట్టి బిగ్ బాస్ కి వెళ్ళాలనే కోరికతో దొరికిన ప్రతీ అవకాశాన్ని ఒడిసిపట్టుకొని బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. ఒకనొక దశలో చనిపోవడానికి సిద్ధమైన పల్లవి ప్రశాంత్.. వాళ్ళ నాన్న చెప్పిన కొన్ని మాటలతో బ్రతికాడని, ఇక చచ్చేం సాధిస్తాం, ఉన్నప్పుడే అనుకున్నది సాధించాలనే తపనతో బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్.

బిగ్ బాస్ సీజన్-7 ఉల్టా పల్టా తో మొదలైన సంగతి అందరికి తెలిసిందే. అయితే పవరస్త్రని ఎవరైతే దక్కించుకుంటారో వారే హౌజ్ లో ఉండటానికి అర్హులని అప్పటిదాకా కంటెస్టెంట్స్ మాత్రమే అని హోస్ట్ నాగార్జున చెప్పగా.‌ దానికి తగ్గట్టుగానే పల్లవి ప్రశాంత్ కష్టపడుతున్నాడు. అయితే బిగ్ బాస్ హౌజ్ లో అందరూ దాదాపు సీరియల్స్, సినిమాలలో నటించి ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకున్నవాళ్ళే.. దాంతో అందరు కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. రైస్ బ్యాగ్, వాళ్ళ ఊరిలోని మట్టితో హౌజ్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్.. నాగార్జున ప్రశంసలు దక్కుంచుకున్నాడు. హౌజ్ లోకి వెళ్ళినప్పటి నుండి అందరితో కలిసి పోవాలనుకుంటున్న పల్లవి ప్రశాంత్ ని కావాలని కార్నర్ చేయాలని ప్రియాంక జైన్ నామినేషన్ చేసింది. దీంతో ప్రియాంక జైన్ మీద ఇప్పటికే ట్రోల్స్ మొదలుపెట్టారు నెటిజన్లు.

నామినేషన్ల ప్రక్రియ మొదలవగానే అందరూ పల్లవి ప్రశాంత్ పేరు చెప్తున్నారు. ఎందుకంటే అతనైతే గట్టిగా అనలేడనేమో, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ అంటు ఒకరు నామినేట్ చేయగా, మాటతీరు బాగాలేదని మరొకరు, కలవట్లేదని మరొకరు ఇలా ఒక్కొక్కరు ఒక్కో కారణంతో అందరు అతడినే టార్గెట్ చేస్తున్నారు. ఇక విరిగిపోయిన పల్లవి ప్రశాంత్ తనది తప్పు కాదని, తనకి కనిపించింది చెప్తుంటే అతనని అవహేళన చేస్తూ వెక్కిలి నవ్వులు నవ్వుకుంటున్నారు ప్రియాంక జైన్, అమర్ దీప్, కిరణ్ రాథోర్, షకీల.. ఇలా అందరూ కలిసి పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసినట్టుగా ‌బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు తెలిసిపోతుంది. అయితే పల్లవి ప్రశాంత్ మాత్రం గొడవలకు, వాదనలకు వెళ్ళకుండా తను చెప్పాలనుకున్నది చెప్పేశాడు ప్రశాంత్. అయితే బయట పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ యొక్క సోషల్ మీడియా ఫాలోయింగ్ చూస్తే అత్యధికంగా అయిదు లక్షల పైచిలుకు ఫాలోవర్స్ తో పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉండగా, అమర్ దీప్, ప్రియాంక జైన్ నాలుగు లక్షల పైచిలుకు ఫాలోవర్స్ తో రెండు మూడు స్థానాలలో ఉన్నారు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.