English | Telugu

Brahmamudi : నగలు కావ్యకి ఇచ్చేసిన ఇందిరాదేవి.. వాళ్ళ పరువుతీయాలని అనామిక స్కెచ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-622 లో....రాహుల్, రుద్రాణి కలిసి కావ్య నగలు తాకట్టు పెట్టి హాస్పిటల్ బిల్ కట్టిందని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటే మీరు చూడలేరా అని రుద్రాణి పై రాజ్ కోప్పడతాడు.

ఇక కావ్య అందరి ముందు తప్పు చేసిందానిలాగా ఉండకూడదని నేనే నగలు తాకట్టు పెట్టమని చెప్పాను.. అకౌంట్స్ అన్ని హోల్డ్ లో ఉన్నాయ్ కదా అందుకే అలా చెప్పానని అపర్ణ చెప్తుంది. ఏం చాకచక్యంగా సమాధానం చెప్పావని అపర్ణని అంటుంది రుద్రాణి. నీకేం హక్కు ఉందని నిలదీస్తున్నావ్ రుద్రాణి.. గేంటెస్తే బయటకు వెళ్లిపోతావంటూ రుద్రాణికి చివాట్లు పెడుతుంది అపర్ణ. మరి నగల గురించి అడిగినప్పుడే ఎందుకు చెప్పలేదని ధాన్యలక్ష్మి అడుగుతుంది. నాకు సెన్స్ ఉంది.. అప్పుడే చెప్తే ఈ రుద్రాణి అప్పుడే గొడవ చేసేదని అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత రాహుల్, రుద్రాణిలు అవమానంగా ఫీల్ అయ్యి అక్కడ నుండి వెళ్లిపోతారు.

ఆ తర్వాత అపర్ణ, ఇందిరాదేవి కావ్య ఇంటికి వచ్చి మాట్లాడుకుంటారు. ఇప్పుడు అసలు నిజం చెప్పమని కావ్యని నిలదీస్తుంది అపర్ణ. కానీ కావ్య డైవర్ట్ చేస్తుంది. కావ్య చెప్పేది అయితే ఎప్పుడో చెప్పేది.. నువ్వు సైలెంట్ గా ఉండమని అపర్ణతో ఇందిరాదేవి అంటుంది. నాకేం జరిగుతుందోనని టెన్షన్ గా ఉంది నిజం చెప్పమని అపర్ణ అంటుంది. అయినా కావ్య చెప్పకపోవడంతో.. ఇక నువ్వు నాతో మాట్లాడకని అపర్ణ కోపంగా వెళ్లిపోతుంది. అసలు సమస్య ఏంటో ఇంటిపెద్దగా నేను కనుక్కోవాలని ఇందిరాదేవి అనుకుంటుంది.

ఆ తర్వాత రాజ్, కావ్య లు జరిగింది గుర్తుచేసుకుంటారు. ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ వచ్చిందని రాజ్ అంటాడు. ఏంటని కావ్య అడుగగా.. ఇక నిజం అంతా ఇంట్లో వాళ్ళకి చెప్పేద్దామని అంటాడు. దానికి రుద్రాణి, ధాన్యలక్ష్మి లు ఎలా మాట్లాడుతారో కావ్య ఉహించుకొని చెప్తుంది. దాంతో వద్దని రాజ్ అంటాడు.

తరువాయి భాగంలో నీకు తోడుగా ఉంటానని ఇందిరాదేవి నగలు కావ్యకి ఇస్తుంది. మరొకవైపు రాజ్ వాళ్ళు అప్పులు చేస్తున్నారని ఈ విషయం మీడియాకి చెప్పి లైవ్ ని ఎంజాయ్ చేద్దామని సామంత్ తో చెప్తుంది అనామిక. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.