English | Telugu

Tanuja Elimination: తనూజ ఎలిమినేషన్ ఫిక్స్.. ఫేక్ ఓటింగ్ ని గుర్తించిన ఆడియన్స్!

బిగ్ బాస్ దత్తపుత్రిక తనూజ ఎలిమినేషన్ కన్ఫమ్.. ఎస్ నిజమే.. ఇది వందకి వంద శాతం నిజం.. ఎందుకంటే ఇది ఆడియన్స్ మాట.. అదే ఆడియన్స్ ఓటింగ్.. అదేంటది.. అన్ని పోల్స్ లో తనూజ టాప్ ఉందని అంటున్నారు కదా అని కొంతమంది అనుకోవచ్చు కానీ అసలు నిజమేంటో ఓసారి చూసేద్దాం.

తనూజకి ప్రతీ నామినేషన్లో యాభై నుండి అరవై శాతం ఓటింగ్ పడుతోంది. అంటే ఒక పదివేల ఓట్లు మొత్తంగా పడితే వాటిల్లో ఆరువేల ఓట్లు తనూజకే పడుతున్నాయి. ఇదంతా బిగ్ బాస్ చేస్తున్న ఫేక్ ఓటింగ్ అని , పీఆర్ లు చేసే డూప్లికేట్ ఓట్లని తెలుస్తోంది. అందుకే ప్రతీ రివ్యూయర్ చాలా స్ట్రాంగ్ గా తనూజకి బిగ్ బాస్ విన్నర్ చేయాలని చేస్తున్నాడని అంటున్నారు. మరి ఇది నిజమేనా అంటే నిజమే.. ఎందుకంటే తనూజ ఎంట్రీ రోజే.. తను అన్నపూర్ణ స్టూడియోస్ దత్తపుత్రిక అని నాగార్జున స్టేజ్ మీద చెప్పేశాడు. ఇక తను ఏం చేసినా పాజిటివ్ గా చూపిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఫైనల్ ఓటింగ్ లో కూడా తనే టాప్ లో ఉంటుంది . దీనివల్ల జెన్యున్ కంటెస్టెంట్స్ కి అన్యాయం జరుగుతుంది.

నామినేషన్స్ లో ఉన్నావారిలో తనూజ మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత రెండో స్థానంలో పవన్ కల్యాణ్ పడాల, మూడో స్థానంలో సుమన్ శెట్టి ఉన్నారు. నాలుగు, ఐదు స్థానాల్లో సంజనా, భరణి కొనసాగుతున్నారు. ఇక ఆరు, ఏడు స్థానాల్లో సాయి శ్రీనివాస్, రాము రాథోడ్ ఉన్నారు. అంటే ప్రస్తుతం రాము రాథోడ్, సాయి శ్రీనివాస్ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇలోపు ఓటింగ్ లో మార్పులు రావచ్చు. ఒకవేళ ఇదే ఓటింగ్ పడితే రాము రాథోడ్ కానీ సాయి శ్రీనివాస్ గానీ ఎలిమినేట్ అవ్వక తప్పదు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.