Read more!

English | Telugu

బిగ్ బాస్ సీజన్-7 లో మొదటి కెప్టెన్ గా పల్లవి ప్రశాంత్!

 

బిగ్ బాస్ హౌజ్ లో సరికొత్తగా రూల్స్, టాస్క్ లు వచ్చాయని తెలిసిన విషయమే. అయితే ఉల్టా పుల్టా థీమ్ జనాలని ఆకర్షిస్తున్న ఈ సీజన్.. భారీ హిట్ గా నిలుస్తుంది. 

హౌజ్ లోకి మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా అందులో ఇప్పటికే కిరణ్ రాథోడ్, షకీల, దామిణి, రతిక.. నలుగురు ఎలిమినేట్ అవ్వగా పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అయిదవ వారం టాస్క్ ల క్రేజ్ గా సాగింది.  సెంచురీ మ్యాట్రిసెస్ టాస్క్ లో ప్రియాంక జైన్ గెలిచి సెంచురీ మ్యాట్రిసెస్ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ కొనసాగింది.

నిన్న మొన్నటిదాకా సాగిన చిట్టీ ఆయిరే టాస్క్ లో టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, ఆట సందీప్, పల్లవి ప్రశాంత్ తర్వాతి లెవెల్ కి వెళ్ళారు. ఆ తర్వాత రంగు పడుద్ది టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో ఒక సర్కిల్ గీసాడు. ఇక ఒక్కో కంటెస్టెంట్స్ కి ఒక్కో కలర్ ఇచ్చాడు. తెల్ల టీ షర్ట్ వేసుకున్న కంటెస్టెంట్స్ ఆ రంగుని ఒకరు మరొకరి టీ షర్ట్ మీద పూయాలి. ఈ టాస్క్ కు సంచాలకురాలిగా ప్రియాంక జైన్ వ్యవహరించింది.

రంగు పడుద్ది టాస్క్ లో మూడు లెవెల్స్ ఉంటాయి. మెదటి లెవెల్ లో బజర్ వచ్చే టైమ్ కి ఎవరి టీ షర్ట్ మీద ఎక్కువ కలర్ ఉందో చూసి వాళ్ళు ఎలిమినేట్ అవుతారని బిగ్ బాస్ చెప్పగా మొదట ఆట సందీప్ ని అవుట్ అని ప్రియాంక జైన్ అనగా.. ఆట సందీప్ ఆర్గుమెంట్ తో అతడికి సపోర్ట్ చేస్తూ టేస్టీ తేజని ఎలిమినేట్ చేసింది ప్రియాంక జైన్.

ఈ విషయంపై ప్రియాంక జైన్ కి నాగార్జున వార్నింగ్  ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత బజర్ కు ఆట సందీప్ బయటకొచ్చాడు. ఇక ఫైనల్ లెవెల్ గౌతమ్ కృష్ణ, పల్లవి ప్రశాంత్ ల మధ్య జరిగింది. ఇందులో చివరి వరకు గౌతమ్ కృష్ణతో  ప్రశాంత్ పోరాడాడు. ఇందులో పల్లవి ప్రశాంత్ విజేత అని ప్రియాంక జైన్ ప్రకటించింది. ఆ తర్వాత బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ కి కెప్టెన్ బ్యాడ్జ్ పంపించి, ఆట సందీప్ చేతుల మీదుగా ఇప్పించాడు. ఆ తర్వాత తన గురువు శివాజీ కాళ్ళ మీద పడ్డాడు. నువ్వు గెలుస్తావని నాకు తెలుసురా, నా లెటర్ సాక్రిఫైజ్ చేసింది నువ్వు గెలుస్తావనే అని పల్లవి ప్రశాంత్ తో శివాజీ అన్నాడు.