English | Telugu

ఓంకార్ షోలో కూతురితో కలిసి ప్ర‌త్య‌క్ష‌మైన బండ్ల గ‌ణేశ్‌!

ఓంకార్ ప్ర‌యోక్త‌గా స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతోన్న సిక్స్త్ సెన్స్ సీజన్ 4 కి టీవీ సెలెబ్రిటీలను గెస్ట్ లుగా తీసుకొస్తున్నారు. తాజాగా ఈ షోకి నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ వచ్చారు. ఎప్పటిలానే షోలోకి ఎంట్రీ ఇవ్వగానే.. ''వెంకటేశ్వర స్వామికి ఏం ఉత్సవాలు చేస్తారో.. డాలర్ శేషాద్రికి తెలియదా.. అలాగే పవర్ స్టార్ గురించి బండ్ల గణేష్‌కి తెలియదా.. ఆయన నా దేవర‌.. నా ఆస్తి.. నా సర్వస్వం.. ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.." అంటూ పవన్ క‌ల్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

అయితే ఈ షోకి బండ్ల గణేష్ తనతో పాటు తన కూతురు జననిని కూడా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తన కూతురు జనని కోరిన రెండు కోరికలను బయటపెట్టారు. తన కూతురు వయసు 18 ఏళ్లు అని.. ఈ 18 ఏళ్లలో తనను రెండే ప్రశ్నలు అడిగిందని చెప్పారు. "అందులో ఒకటి.. పవన్ కళ్యాణ్ తో మళ్లీ బ్లాక్‌బస్టర్ సినిమా ఎప్పుడు తీస్తావ్..? రెండోది.. ఓంకార్ అన్నయ్య షోకి వెళ్తే నన్ను కూడా తీసుకెళ్లు అని.. అందుకే నా కూతుర్ని షోకి తీసుకొచ్చా.. అదీ నీకున్న క్రెడిబిలిటీ.ష‌ అంటూ ఓంకార్ పై ప్రశంసలు కురిపించాడు బండ్ల గణేశ్‌.

ఈ మధ్యకాలంలో బండ్ల గణేశ్‌ తన స్పీచ్ లతో అదరగొడుతున్నాడు. ఆయన ఎక్కడ ఏం మాట్లాడినా సంచలనం అవుతోంది. ఇప్పుడు సిక్స్త్ సెన్స్ షోలో కూడా తన మార్క్ చూపించి అదరగొట్టాడు. తన కూతురుని మొదటిసారి ఆన్ స్క్రీన్ మీదకు తీసుకొచ్చి పరిచయం చేశారు. ఈ షోలో బండ్ల గ‌ణేశ్ ఇంకేం మాట్లాడారో చూడాలంటే వ‌చ్చే శ‌ని, ఆదివారాల్లో రాత్రి 9 గంట‌ల‌కు స్టార్ మాలో ప్ర‌సారం కానున్న ఎపిసోడ్ చూడాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.