English | Telugu

హౌస్ మేట్స్ పై పొగరు చూపిస్తున్న డమ్మీ కెప్టెన్ అమర్ దీప్!


బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఒక ఇంటెన్స్ డ్రామాని అందిస్తుంది. ఈ సీజన్-7 ఉల్టా పుల్టా థీమ్ ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో విజయం సాధించిందనే చెప్పాలి. గతవారం గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అవ్వడంతో ఈ వారం హౌస్ లో ఏడుగురు హౌస్ మేట్స్ ఉన్నారు. వీరిలో అంబటి అర్జున్ ఇప్పటికే టికెట్ టు ఫినాలే గెలిచి ఫినాలేకి అర్హత సాధించాడు.

ఇక హౌస్ లో ఈ వారం మొత్తం ఓట్ అప్పీల్ కోసం కంటెస్టెంట్స్ చేత ఫన్ గేమ్స్ ఆడిస్తున్నాడు బిగ్ బాస్.‌ ఇందులో హౌస్ మేట్స్ లో గొడవలు జరుగుతున్నాయి. మొన్నటి ఎపిసోడ్‌లో.. ఆ రోజు జరిగిన టాస్క్ లలో గెలిచి శోభాశెట్టి ఓట్ అప్పీల్ చేసుకుంది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో అంబటి అర్జున్, అమర్ దీప్ ఓట్ అప్పీల్ కోసం టాస్క్ లలో గెలిచి అర్హత సాధించారు.

ఇక వీరిద్దరిలో ఎవరు ఓట్ అప్పీల్ చేసుకోవాలో డిసైడ్ చేయడానికి హౌస్ మేట్స్ మద్దతు కావాలని బిగ్ బాస్ చెప్పడంతో.. ఒక్కో‌ హౌస్ మేట్ తమ అభిప్రాయం చెప్పారు. ప్రశాంత్ తన మద్దతుని అంబటి అర్జున్ కి ఇచ్చాడు. నేను ఎందుకు అనర్హుడని అనుకుంటున్నావని అమర్ దీప్ అనగా.. ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు లాస్ట్ వీక్ నిన్ను సపోర్ట్ చేసినందుకు నాకు బాగానే చేసావ్.. అందుకనే అర్జున్ కి సపోర్ట్ చేస్తున్నానని ప్రశాంత్ అన్నాడు. శివాజీ, యావర్ లు కూడా అర్జున్ కి సపోర్ట్ చేయడంతో.. అమర్ దీప్ కి కోపం పెరిగిపోయింది.

ఇక హౌస్ కి నేను కెప్టెన్.. నేను చెప్తున్నాను నువ్వు అక్కడికి వెళ్ళు అంటూ యావర్ పై డమ్మీ కెప్టెన్ అమర్ దీప్ రెచ్చిపోయాడు. యావర్ లా ఇమిటేట్ చేస్తూ.. వాళ్ళు నీ దగ్గర మంచివాళ్ళు అనిపించుకోవాలని నీకు సపోర్ట్ చూస్తున్నారంటూ అర్జున్ తో అన్నాడు‌ అమర్. ఇక ఎప్పటిలాగే శోభాశెట్టి, ప్రియాంక ఇద్దరు అమర్ దీప్ కే సపోర్ట్ చేసారు. అయితే ఈ వారం నామినేషన్ లో‌ ఉన్న అమర్ దీప్ కి ఓటింగ్ తక్కువ ఉందనేది వాస్తవం. కానీ శోభాశెట్టి, ప్రియాంక లీస్ట్ లో ఉన్నారు. మరి వారిద్దరిని హౌస్ లో ఉంచి అమర్ ని బయటకు పంపిస్తారా లేక అమర్ ని కాకుండా అత్యధిక ఓటింగ్ ఉన్న యావర్ ని బయటకు పంపిస్తారా చూడాలి మరి. ఇక ఓట్ అప్పీల్ లో అమర్-ప్రశాంత్, యావర్-అమర్ ల మధ్య గొడవ గట్టిగానే జరిగినట్టు ఈ ప్రోమోలో తెలుస్తుంది.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.