English | Telugu

అఖిల్ సార్థక్ కి సర్‌ప్రైజ్‌ చేసిన మోనాల్

బిగ్ బాస్ సీజన్ 4 అంటే చాలు ముందు గుర్తొచ్చేది అఖిల్ సార్థక్, మోనాల్ గుజ్జర్. ఈ బిగ్ బాస్ తర్వాత వీళ్ళిద్దరూ దూరమైపోయారు. మళ్ళీ ఇన్నాళ్లకు అఖిల్ సార్థక్ తో కలిసి వాళ్ళ సలోన్ కి వచ్చింది. అలాగే లైవ్ లోకి వచ్చింది. కాసేపు ఫాన్స్ తో మాట్లాడారు. అల్లరి నరేష్ నటించిన "సుడిగాడు" అనే మూవీతో మోనాల్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఎన్నో మూవీస్ చేసింది. ఇక తర్వాత ఆమె గుజరాత్ వెళ్ళిపోయి అక్కడ గుజరాతి మూవీస్ లో నటిస్తోంది. ఇక అఖిల్ కి కూడా చెప్పకుండా వచ్చి సర్ప్రైజ్ చేసింది. ఇక ఈ వీడియోని, పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. "చాలా ధన్యవాదాలు, సర్‌ప్రైజ్‌చేసినందుకు...కొంతకాలంగా నేను చాలా నిరుత్సాహంగా ఉంటున్నాను.

ఇప్పుడు నువ్వు ఇలా రావడం నిజంగా హ్యాపీగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను చూడటం నా మనసుకు సంతోషంగా అనిపిస్తోంది. నీ రాకతో నేను షాక్ అయ్యాను...నిన్ను చూసేసరికి నా నోట మాట రాలేదు..ఎల్లప్పుడూ నా బెస్ట్ ఫ్రెండ్‌గా ఉన్నందుకు ధన్యవాదాలు. ఎప్పటికీ మనం ఫ్రెండ్స్" అంటూ కొన్ని లైన్స్ ని పోస్ట్ చేసాడు. ఇక నెటిజన్స్ ఐతే "మీ ఇద్దరి కోసం ఈ బిగ్ బాస్ సీజన్ చూసాను. ఈ కాంబోని చాలా రోజులు మిస్సయ్యాం. ఓజి పెయిర్, ఎన్ని బిబి జోడీస్ వచ్చినా మీరు ఇద్దరు చాలా స్పెషల్ అంతే..మిమ్మల్ని ఇలా కలిపి చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని ఇలా చూడడం బాగుంది. సోహైల్ కూడా ఉంటే బాగుండేది." అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.