English | Telugu

ముగిసిన ఇండియన్ ఐడల్ సీజన్ 4.. విన్నర్ గా  లేడీ రాక్ స్టార్ బృందా

ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ఫైనల్స్ కి వచ్చేసింది. ఫైనలిస్టులందరినీ స్టేజి మీదకు పిలిచారు. బృందా, సృష్టి చిల్ల, పవన్ కళ్యాణ్, ధీరజ్, స్నిగ్ధ, కూర్మ సహస్ర వీళ్లంతా అదిరిపోయే కాస్ట్యూమ్స్ తో మంచి సాంగ్స్ పాడి అందరినీ అలరించారు.

ఐతే ఈ ఆరుగురిలో టాప్ 3 లోకి పవన్ కళ్యాణ్, బృంద, ధీరజ్ ఎంపికయ్యారు. ఫైనల్ సాంగ్ గా బాయ్స్ మూవీ నుంచి "సరిగమే పదనిసే" అనే చరణాన్ని ముగ్గురూ పాడి జడ్జెస్ నుంచి మంచి కాంప్లిమెంట్స్ అందుకున్నారు.

ఇక విన్నర్స్ ని అనౌన్స్ చేశారు. ఫస్ట్ రన్నరప్ గా పవన్ కళ్యాణ్ ని సెలక్ట్ చేశారు. అతనికి 5 లక్షల కాష్ ప్రైజ్ ఇచ్చారు. ఇక ఈ సీజన్ ట్రోఫీని బృందా గెలుచుకుంది. ఆహా సి.ఈ.ఓ, థమన్, కార్తీక్ వచ్చి ట్రోఫీ ఇచ్చి 10 లక్షల కాష్ ప్రైజ్ ని అందించారు. ఇక ఈ సీజన్ ఇలా ముగిసిపోయింది.

సీజన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో ఎప్పుడు ఎండ్ అయ్యిందో కూడా తెలీనట్టుగా ఈ సీజన్ ముగిసిపోయింది. ఇక ఈ సీజన్ లో చాలామంది కంటెస్టెంట్స్ కి థమన్, కార్తిక్ కలిసి సినిమాల్లో పాడే అవకాశాలు అలాగే కన్సర్ట్స్ కి కూడా షో స్టాపర్స్ గా ఉండే ఛాన్స్ లు ఇచ్చారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.