Read more!

English | Telugu

షిరిడీలో మోసాలు.. జాగ్రత్తగా ఉండాలని చెప్తున్న ఆదిరెడ్డి!

ఆదిరెడ్డి.. బిగ్ బాస్ సీజన్-6 తో ఫేమస్ అయ్యాడు. ఒక కామన్ మ్యాన్ గా, ఒక రివ్యూయర్ గా బిగ్ బాస్ సీజన్-6 లోకి ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి.. తన మైండ్ గేమ్ తో గట్టి పోటీ ఇవ్వటమే కాకుండా, హౌస్ లో మంచి ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చాడు.

బిగ్ బాస్ హౌజ్ లో ఆదిరెడ్డికి డ్యాన్స్ రాకపోయినా కానీ హోస్ట్  నాగార్జున డ్యాన్స్ చేయమనగానే చేసేసాడు. అది చూసి అందరూ నవ్వుకున్నారు. బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ అందరి స్క్రీన్ టైం తో పోలిస్తే ఆదిరెడ్డి స్క్రీన్ మీద ఎక్కువగా కనిపించే వాడు. హౌస్ లో ఆదిరెడ్డి ఉన్నప్పుడు ఒక‌ వీక్ లీడర్ అయ్యాడు. కామన్ మ్యాన్ రివ్యూయర్ అయ్యాడు, రివ్యూయర్ టీం లీడర్ అయ్యాడని నాగార్జున చెప్పగానే ఆ వారం  అంతా ఆదిరెడ్డి ట్రెండింగ్ లో ఉన్నాడు.

బిగ్ బాస్ తర్వాత ఆదిరెడ్డి తన సొంతూరికి వెళ్ళాడు. అక్కడ తన ఫ్యామిలీతో టైం గడుపుతున్నాడు. ఆదిరెడ్డి తన ప్రతీ అప్డేడ్ ని ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లలో షేర్ చేస్తుంటాడు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని ఒక అనాధాశ్రమంకి వెళ్ళి వారికి ఆర్థిక సాయం చేయడంతో ఆ వ్లాగ్ ని యూట్యూబ్ లో చూసినవాళ్ళంతా ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత తను ఐపీఎల్ రివ్యూ చేయడం, తన చెల్లికి బంగారం తీసుకునేది, కొత్త ఇంట్లోకి వెళ్ళింది, అద్దె ఇంటికి సీసీటీవి కెమెరాలు ఫిక్స్ చేసింది, గృహ ప్రవేశం చేసినట్లు ఇలా అన్ని వ్లాగ్ లని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా వాటికి మంచి వ్యూస్ వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా ఆదిరెడ్డి ఫ్యామిలీ షిర్డి వెళ్ళారు.

అయితే అక్కడ జరుగుతున్న మోసాల గురించి ఒక వ్లాగ్ చేసి అందులో చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి. "అక్కడ మనకి ఏమీ తెలియదని చెప్పి ప్రతీదానికి డబ్బులు వసూలు చేస్తూ మనల్ని లూటీ చేస్తున్నారు‌. అసలు అక్కడంతా ఉచితమే. కానీ మధ్యలో ఈ దందా చేసేవాళ్ళు.. అక్కడే ఉంటూ మనకి హిందీ రాదని చెప్పి మోసం చేస్తున్నారు. మేం అలానే మోసపోయాం‌. మీరు జాగ్రత్తగా ఉండండి" అంటూ ఆ వ్లాగ్ లో వివరించాడు ఆదిరెడ్డి. కాగా ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తోంది. 'మాకు కూడా అలాగే జరిగింది' అని ఒకరు, 'అవును మీరు చెప్పినట్టుగానే జరుగుతుంది' అని మరొకరు. ఇలా ఈ వీడీయోకి కామెంట్ల రూపంలో ఆదిరెడ్డికి ప్రశంసలు అందుతున్నాయి.