English | Telugu

టార్గెట్ అరియానా.. బుద్ది చూపించిన అఖిల్‌

రేస్ టు ఫినాలే ముందు జ‌రిగే చివ‌రి నామినేష‌న్స్ సోమ‌వారం మొద‌ల‌య్యాయి. దీని హీట్ మామూలుగా లేదు. ఫైన‌ల్ కి మ‌రో మూడు వారాలే వుండ‌టంతో టాప్ 5 లో నిలిచేది ఎవ‌రు? టైటిల్ విన్న‌ర్ గా క‌ప్పుని సొంతం చేసుకునేది ఎవ‌ర‌న్న‌ది ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది. ఈ వారం నామినేష‌న్స్ కి సంబంధించిన ప్రోమో విడుద‌లైంది. ఇందులో అఖిల్, అరియానాల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రిగింది. నిజానికి ఫ్యామిలీ మెంబ‌ర్స్ హౌస్ లోకి వ‌చ్చి వెళ్ల‌డంతోనే ఈ సీజ‌న్ విన్న‌ర్ ఎవ‌రో తేలిపోయింది. అషురెడ్డిని బ‌య‌ట నుంచి సపోర్ట్ చేస్తున్న రాహుల్ సిప్లిగంజ్ సైతం బిందు మాధ‌వికి టాప్ ప్లేస్ ఇవ్వ‌డంతో త‌నే టైటిల్ విన్న‌ర్ అనే సంకేతాలు ఇంటి స‌భ్యుల‌కు క్లియ‌ర్ గా వెళ్లిపోయాయి.

హౌస్ లోకి వ‌చ్చిన అనీల్ అక్క కూడా ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది. అయితే హౌస్ లో వున్న అరియానా కూడా ఈ సారి ఉమెన్ బిగ్ బాస్ విన్న‌ర్ కావాల‌ని గ‌ట్టిగా వాదించింది. దీంతో అఖిల్ ఎప్ప‌టిలాగే త‌న బుద్ధి చూపించేశాడు. ఈసారి తానే విన్న‌ర్ అనే భ్ర‌మ‌ల్లో వున్న అఖిల్ నామినేష‌న్స్ లో ఈ విషయంపై అరియానాని టార్గెట్ చేయ‌డంతో ఒక్క‌సారిగా హౌస్ లో ఇద్ద‌రి మ‌ధ్య తీవ్ర చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా అరియానా `ఉమెన్ కార్డ్` తీసుకురావ‌డం త‌న‌కు న‌చ్చ‌లేద‌ని మొఖం మీదే చెప్పేశాడు.

అమ్మాయిలు గెలవాల‌ని కోరుకుంటున్నా అని అన్నావ్ అమ్మాయి గెల‌వాల‌ని అనుకున్న నువ్వు దానికి త‌గ్గ‌ట్టుగా గేమ్ ఎందుకు ఆడ‌లేదు` అని అఖిల్ అరియానాపై మండిప‌డ్డాడు. దీంతో అరియానా బ‌య‌ట టాక్ అదే వుంది. దాన్నే నేను కోరుకుంటున్నా బిగ్ బాస్ అని చెప్పేసింది. అది రాంగ్ అని అకిల్ అన‌డంతో `నేను గెలిచినా గెల‌వ‌క‌పోయినా ఒక స్ట్రాంగ్ ఉమెన్ బిగ్ బాస్ టైటిల్ గెల‌వాలి అంటూ గ‌ట్టిగా అరిచి చెప్పింది అరియానా. దీంతో అఖిల్ ఎవ‌రు బాగా ఆడితే వాళ్లే టైటిల్ విన్న‌ర్ అవుతారంటూ మ‌ళ్లీ ఫైర‌య్యాడు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.