English | Telugu

శ్రీచరణ్ చెప్పాడు...శ్రీముఖి చెక్ మీద సంతకం చేసింది!

వినాయక చవితిని పురస్కరించుకుని జీ తెలుగు "మన ఊరి రంగస్థలం" పేరుతో ఒక ఈవెంట్ చేసింది. ఆ ఎపిసోడ్ ప్రోమో చూస్తే ఫుల్ ఎంటర్టైన్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో ఎన్నో లవ్ ట్రాక్స్ ని చూపించారు. అలాగే గణపయ్య లడ్డూ వేలంపాట కూడా జరిగింది. ఈ ఎపిసోడ్ లో 'సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్' నుంచి కంటెస్టెంట్స్ అంతా వచ్చారు. శ్రీముఖి, శ్రీచరణ్ ఇద్దరూ ఫుల్ ఎంటర్టైన్ చేశారు. మనో, గీతామాధురి పాటలతో అదరగొట్టారు.

బుల్లి తెర మీద రోజూ మనం చూసే షోస్ లో నటీనటులంతా వచ్చి డాన్సులు చేశారు. ఇక ఈ షోలోశ్రీముఖి అల్లరి మాములుగా లేదు. "మీకెప్పుడైనా అందమైన అమ్మాయి కనిపించినప్పుడు ఆ అమ్మాయి వెంట పడ్డారా?" అని మనోని శ్రీముఖిఅడిగింది. "లేదు అది కలగానే మిగిలిపోయింది" అన్నారు మనో . "ఇప్పుడు దాన్ని నిజం చేసుకోండి" అనేసరికివెంటనే రోహిణి లవర్ లా ఎంట్రీ ఇచ్చి మనో ముఖాన్ని తన ఓణీతో తుడుస్తూ "టచప్ గర్ల్ అనుకున్నారా?" అంది. "టచ్ ఇచ్చావుగా మరి" అని అన్నారు మనో గారాలు పోతూ. "పూలు తీసుకురమ్మంటే పూల చొక్కా వేసుకొచ్చావ్.. హేనాటీ" అంది రోహిణి.. "యు లూటీ "అంటూ నవ్వుతూ మనో అనేసరికి రోహిణి షాక్ ఐపోయింది.

ఫైనల్ గా వంద కేజీల లడ్డుకి వేలం పాట పెట్టారు. అందరూ పాడుకుంటారు. హరితేజ లక్ష, భానుశ్రీ రెండు లక్షలు అంటూ పాడుతుండగా "శ్రీముఖి గారి పాట ఐదు లక్షలు" అంటూ శ్రీచరణ్ ఎంట్రీ ఇచ్చాడు. అతను అలా చెప్పగానే ఇలా చెక్ రాసిచ్చేసింది శ్రీముఖి. ఇది అంద‌రి దృష్టినీ విప‌రీతంగా ఆక‌ర్షించింది.