English | Telugu

Bigg Boss 8 : ఎలిమినేషన్ నుండి సోనియా సేఫ్.. ఫస్ట్ వీక్ మీరంతా ఫ్లాప్!

బిగ్‌బాస్ సీజన్ 8లో తొలి వీకెండ్ ఎపిసోడ్ ఏదో హీటుహీటుగా జరుగుతుందేమోనని ఆడియన్స్ అనుకున్నారు. ఎందుకంటే యష్మీ టీమ్ చేసిన హంగామా, చూపించిన సైకోయిజానికి నాగ్ ఏమైనా వార్నింగ్ ఇస్తారేమోనని ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ అలాంటిదేం జరగలేదు. శనివారం నాడు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం‌. (Bigg Boss 8 Telugu)

బిగ్ బాస్ మొదలై అప్పుడే మొదటి వారం పూర్తయ్యింది. ఇక హౌస్ లో ఉన్న పద్నాలుగు మందిలో ఆరుగురు నామినేషన్ లో ఉండగా.. శనివారం నాటి ఎపిసోడ్ లో సోనియా సేవ్ అయ్యింది. ఇంకా అయిదుగురు నామినేషన్ లో ఉన్నారు. ఇక శనివారం నాగార్జున టిప్ టాప్ గా రెడీ అయి వచ్చి.. శుక్రవారం ఏం జరిగిందో మొదట చూపించాడు. ఇక హౌస్ మేట్స్ అందరికి హాయ్ చెప్పేసి మొదలెట్టాడు. ఇక హౌస్ లో ఎవరెవరు ఏం చేశారు? ఎవరెలాంటి వారో మీకు మీరే చెప్పండి అని చెప్పగా... ఒక్కొక్కరుగా వచ్చి తమ అభిప్రాయాలని చెప్పారు. ఇక వారి ఒపీనియన్ తీసుకున్నాక ఈ వారం మీ ప్రొగ్రెస్ కార్డు అంటూ ఓ బోర్డ్ తీసుకొచ్చాడు నాగార్జున.

ఈ వారం ఆటలో ఎవరు ఫ్లాప్ అనేది మాత్రమో చెబుతానంటూ క్లారిటీ ఇచ్చాడు నాగార్జున. ముందుగా ప్రేరణ నువ్వు ఫ్లాప్.. ఎంట్రీలో నిన్ను చూసి సూపర్ హిట్ అనుకున్నా కానీ హౌస్‌లో స్పార్క్ లేదంటూ నాగార్జున అన్నాడు. తర్వాత సీత నువ్వు ఫ్లాప్.. నువ్వు చాలా స్ట్రాంగ్ అండ్ కేరింగ్ అని అన్నావ్ కానీ అవి హౌస్‌లో కనిపించడం లేదు.. సీత ఒకటే మిగిలింది కిరాక్ కనిపించడం లేదంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత బేబక్క, ఆదిత్య ఫ్లాప్ అంటూ నాగార్జున అన్నారు. చివరిగా విష్ణుప్రియ కూడా ఫ్లాప్.. అంటు చెప్పాడు. బిగ్‌బాస్ హౌస్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కి మాత్రమే కాదు ఇది ఓ జీవితం.. కనుక అందరి ఫీలింగ్స్ అర్థం చేసుకొని నడుచుకో.. నీకు హౌస్‌లో ఏమైనా చేసే కేపబులిటీ ఉంది.. వెయిట్ చేస్తున్నా.. అర్థం చేసుకో అంటు చెప్పాడు. అంటే నీ పర్ఫామెన్స్ చాలడం లేదని నాగార్జున అన్నాడు. అయితే యష్మీ చేసిన పనికి చాలా ఫైర్ అవుతాడని అనుకున్నారంతా కానీ అదేం జరగలేదు. మరి రేపటి ఎపిసోడ్ లో ఎలా ఉంటుందో చూడాలి మరి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.