English | Telugu
ప్రేమించి మోసం చేసినవాడిని తలుచుకుని బాధపడుతున్న రష్మీ!
Updated : Aug 30, 2022
జబర్దస్త్ అంటే కొంత కాలం క్రితం వరకు యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్ మధ్య లవ్ ట్రాక్ చూపించేవారు. ఇక ఈ ట్రాక్ కూడా నిజమేనేమో అనే రీతిలో ఉండేది వీళ్ళ నటన కూడా. వీళ్ళు ఎన్నో లవ్ సాంగ్స్ కి డాన్సులేస్తూ ఆడియన్స్ అదే ట్రాన్స్ లో ఉంచేసేవారు. అయితే కొన్ని రోజులుగా రష్మికి దూరమయ్యాడు సుధీర్. వేరే షోస్, సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. `జబర్దస్త్`, `ఎక్స్ ట్రా జబర్దస్త్`, `శ్రీదేవి డ్రామా కంపెనీ`లకు సుధీర్ ప్లేస్ లో హోస్ట్ గా చేస్తోంది రష్మి. గతంలో ఒక సందర్భంలో తన లవ్ ఫెయిల్ అంటూ చెప్పింది రష్మి. ఇప్పుడు ఆమె ప్రేమించిన వాడు మోసం చేయడంతో ఎంత బాధపడుతుందో అనే విషయాన్ని కళ్లకి కట్టినట్టు చూపించింది.
ప్రాణంగా ప్రేమించి అబ్బాయి పెళ్లి చేసుకుందాం, రిజిస్టర్ ఆఫీస్ కి రమ్మని చెప్పి మరో డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే... చేతిలో పూలదండతో ప్రేమించిన అమ్మాయి తన ప్రియుడి కోసం పడే బాధను మాటల్లో చెప్పలేం. ఆ బాధను రష్మీ ఒక పాటలో చాలా ఎమోషనల్ గా చూపించింది. `అటు నువ్వే ఇటు నువ్వే.. `అంటూ సాంగ్ లో రష్మి చేసిన డాన్సు పర్ఫెర్మెన్స్ అందరినీ కంట తడి పెట్టించింది. తర్వాత నాగినీడు చెప్పిన డైలాగ్ అందరి హృదయాలని కలచి వేసింది. బాధలోంచి వచ్చే ఎక్స్ ప్రెషన్స్ డెప్త్ వేరే లెవల్లో ఉంటాయన్నారు. తన డాన్స్ పెర్ఫార్మెన్స్ కి నెటిజన్లు సుధీర్ దూరం కావడమే తన బాధకు కారణమా ? అని పోస్ట్ లు పెడుతున్నారు.
ఇక ఇదంతా `మన ఊరి దేవుడు` అనే స్పెషల్ ప్రోగ్రామ్లోని దృశ్యాలు . వినాయకచవితి సందర్భంగా ఈ స్పెషల్ ప్రోగ్రామ్ రాబోతోంది. ఇందులో రష్మి లవ్ ఫెయిల్యూర్ డాన్స్ పెర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలవబోతోంది.