English | Telugu

ప్రామిసింగ్‌గా క‌నిపిస్తోన్న కొత్త సీరియ‌ల్ 'నేత్ర‌'

నేత్ర అనే కొత్త సీరియల్ జెమినీ టీవీలో త్వరలో ప్రసారం కాబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "నరుడికి, నాగినికి మధ్య ప్రేమ గెలిస్తేనే రాక్షస సంహారం జరుగుతుంది ..నాగమణి సొంతమవుతుంది" అనే కాన్సెప్ట్ తో మన ముందుకు రాబోతోంది. ప్రేమ కోసం పగతో నాగిని యుద్ధం చేయబోతోంది. ఇందులో హీరోగా మలయాళ నటుడు ప్రేమ్ జాకబ్ నటిస్తున్నాడు.

బాలీవుడ్ లో ఎన్నో సీరియల్స్ లో నటించిన శివాని తోమర్ ఈ సీరియల్ లో యాక్ట్ చేస్తోంది. ఎన్నో తెలుగు సీరియల్స్ లో నటించిన భరద్వాజ్ కూడా ఈ సీరియల్ లో నటిస్తున్నాడు.అత‌ను 'మొగలి రేకులు' సీరియల్ లో ఒక చిన్న నెగటివ్ రోల్ లో నటించాడు. గతంలో 'ప్రతిఘటన', 'ఆడదే ఆధారం' సీరియల్స్ లో నటించాడు.

శ్రీమతి శ్రీనివాస్, అభిషేకం, పద్మవ్యూహం, కార్తీక దీపం వంటి సీరియల్స్ లో నటించిన జ్యోతి రెడ్డి ఈ సీరియల్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతున్నారు. అంజు అస్రాని, ఒకప్పుడు సినిమాల్లో నటించి ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తున్న చిన్నా, సీనియర్ యాక్టర్ కృష్ణవేణి, ప్రియాంక, 'మట్టిగాజులు', 'మనసు మమత'సీరియల్స్ లో నటించిన చక్రి, రాధాకృష్ణ, దుర్గాదేవి, శ్రావణి యాదవ్ వంటి వారు కూడా కనిపించబోతున్నారు.

అత్తారింటికి దారేది, అల వెంకటాపురం సీరియల్స్ లో నటించిన ప్రియా తరుణ్ కూడా ఈ సీరియల్ లో నటిస్తున్నారు. ఇక ఈ సీరియల్ జెమినీ టీవిలో ఈ నెలలో ప్రసారం కాబోతోంది. దీనికి సంబంధించి డేట్, టైం స్లాట్ త్వరలో వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.