English | Telugu

Guppedantha Manasu : రిషి గతం రివీల్ .. గుప్పెడంత మనసులో సూపర్ ట్విస్ట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1165 లో... రాధమ్మని తీసుకొని రిషి దగ్గరికి వస్తుంది సరోజ. పదా రంగా మన ఇంటికి వెళదామని రాధమ్మ అనగానే.. రంగా ఏంటి వాడు నా కొడుకు రిషి అని మహేంద్ర అంటాడు. రిషి కాదు రంగా అని చెప్పమని రాధమ్మ అనగానే.. లేదు నానమ్మ నేను రిషిని.. తన కొడుకుని, వసుధార భర్తని అని అనగానే రాధమ్మ, సరోజ షాక్ అవుతారు. మీకు రంగాని చూపిస్తానని రిషి అంటాడు. అప్పుడే సరోజ పక్కకి వెళ్లి నువ్వు వసుధర కలిసి నా బావ పూర్తిగా రిషిలాగా మార్చారు.. ఇప్పుడు అసలు రంగా చూపిస్తాను.. నేను రిషిని అంటున్నాడని శైలేంద్రకి ఫోన్ చేసి చెప్తుంది సరోజ. దాంతో శైలేంద్ర షాక్ అవుతాడు. అసలు రంగా దగ్గరికి వెళ్తున్నారా.. నేను వస్తాను లొకేషన్ పంపు అనగానే సరోజ పంపిస్తుంది.

ఆ తర్వాత అసలు ఇదంతా ఏంటి అని వసుధారని మహేంద్ర అడుగుతాడు. అంత అర్థం అయ్యేలా చెప్తానని వసుధార జరిగింది మొత్తం చెప్తుంది. రిషి రంగాలా ఎందుకు మారాల్సి వచ్చిందో చెప్తుంది. సర్ కార్ లో ఉన్న లెటర్ రంగాకి దొరికింది అంట.. అది ఇవ్వడానికి వచ్చినప్పుడు.. సర్ పై ఎటాక్ జరుగుతుంటే.. సర్ ని కాపాడి తనకు ప్రాబ్లెమ్ అయింది. అందుకే తన ప్లేస్ లో రిషి సర్ వెళ్ళాడని వసుధార చెప్తుంది. ఇంతకు ఆ లెటర్ ఎవరు రాసారని మహేంద్ర అడుగుతాడు. జగతి మేడమ్ రాసిందట అని వసుధార చెప్తుంది. అందులో ఏముందో చదవాలని మహేంద్ర అనగానే.. నాకు తెలియదు మావయ్య రిషి సర్ వచ్చాక అడిగి చదవాలని వసుధార అంటుంది. మరొకవైపు రాధమ్మ వాళ్ళని తీసుకొని చక్రపాణి ఇంటికి వస్తాడు రిషి. వాళ్లకు రంగాని చూపిస్తాడు. అతను రంగా ఏంటి అని సరోజ అంటుంది. అతనే మీ రంగా అంటూ రిషి జరిగింది మొత్తం చెప్తాడు.

ఆ తర్వాత రంగా మాట తీరు బట్టి రాధామ్మ అతనే రంగా అని తెలుసుకుంటుంది. ఇక సరోజకి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుచెయ్యగానే రంగా అని అర్ధం చేసుకుంటుంది. ఇన్ని రోజులు మిమ్మల్ని రంగా అంటూ ఇబ్బంది పెట్టానని రిషికి సారీ చెప్తుంది సరోజ. అదంతా వింటున్న శైలేంద్ర షాక్ అవుతాడు. రంగాని తీసుకొని సరోజ వాళ్ళు వెళ్తారు. సరోజ వాళ్ళకి ఎదరుగా శైలేంద్ర వెళ్లి.. వీడు రంగా ఏంటని అడుగుతాడు. ఇతనే మా రంగా బావ అంటూ సరోజ చెప్తుంది. ఆ తర్వాత రిషి ఇంటికి వెళ్ళగానే రంగా వెళ్లాడా అంటూ వసుధార అడుగుతుంది. వెళ్ళాడని రిషి చెప్తాడు. అమ్మ లెటర్ రాసిందట అందులో ఏముందని మహేంద్ర అడుగుతాడు. అందరి గురించి మన చుట్టూ జరిగిన వాటి గురించి, మీ గురించి , అనుపమ, మనుల గురించి రాసారని రిషి అంటాడు. నేను ఆ లెటర్ చదువుతానని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.