English | Telugu

Guppedantha Manasu:మినిస్టర్ మీటింగ్ లో రిషి సీక్రెట్ మిషన్.. శైలేంద్రకి దిమ్మతిరిగిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -975 లో.. హాల్లో కూర్చొని ఉన్న దేవయాని రిషి గురించి సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ చుసి నిజంగానే రిషి అలా అయిపోయాడా అని ధరణితో అనగానే.. అది నోరా ఇంకేమైనానా అని ధరణి కోప్పడుతుంది. చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిన మీరు.. ఇప్పుడు ఇలా అంటారా? ఏ దుర్మార్గుడు అలా పోస్ట్ పెట్టాడో అంటు ఇండైరెక్ట్ గా దేవయాని, శైలేంద్రలని ధరణి తిడుతుంది. ఆ తిట్లు భరించలేక దేవయాని అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

నాకు తెలుసు అత్తయ్య ఆ పని మీరు మీ కొడుకే చేశారని ధరణి అనుకుంటుంది. రిషి సర్ కావాలంటూ స్టూడెంట్స్ గొడవ చేయడంతో ఏం చెయ్యాలో అర్థం కాని అనుపమ, మహేంద్ర, ఫణింద్ర కలిసి ఆలోచిస్తుంటేమ. అప్పుడే వాళ్ళ దగ్గరికి శైలేంద్ర వస్తాడు. స్టూడెంట్స్ ఏం అంటున్నారని ఫణింద్ర అడుగుతాడు.. వాళ్ళు గొడవ చేస్తున్నారు ఎంత అయిన రిషి వాళ్ళ ఫేవరెట్ సర్ కదా.. అయిన నా తమ్ముడు గురించి అలాంటి వార్తలు వస్తుంటే చాలా బాధగా ఉందని ఏడుస్తున్నటు నటిస్తాడు శైలేంద్ర. ఇక ఈ కాలేజీ మూతపడుతుందేమా? నా ముందే ఈ కాలేజీ ఇలా అవుతుందంటే చూడలేకపోతున్నానని శైలేంద్ర నటిస్తుంటాడు. నువ్వేం బాధపడకు శైలేంద్ర అంట ఫణింద్ర అంటాడు. ఆ తర్వాత మినిస్టర్ వచ్చాడంటూ మీటింగ్ దగ్గరికి వెళ్తారు. మినిస్టర్ మాట్లాడుతు.. అసలేం జరుగుతుంది? ఈ వసుధార ఎక్కడ అని అడుగుతాడు. వస్తుందని మహేంద్ర చెప్పేలోపే అక్కడికి వసుధార వస్తుంది. నీపై నాకు ఎంతో నమ్మకం ఉండేది. స్టూడెంట్ నుండి ఈ స్థాయికి వచ్చవ్ కానీ ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందని మినిస్టర్ అంటాడు.

కాసేపటికి రిషి ఎక్కడ ఉన్నాడని మినిస్టర్ తో పాటు బోర్డు మెంబెర్స్ కూడా అడుగుతారు. చెప్పు వసుధార రిషి ఎక్కడ అని అడుగుతున్నారు కదా అని శైలేంద్ర అంటాడు. మీకో మెసేజ్ వచ్చింది చూసుకోండని వసుధార అనగానే.. శైలేంద్ర తనకి వచ్చిన వాయిస్ మెసేజ్ చూస్తాడు. అందులో రిషి మాట్లాడుతాడు. కాలేజీ గురించి ఇప్పుడు ఎండీగా వసుధార అయితేనే నాకు కరెక్ట్ అనిపిస్తుందని అందులో ఉండగా అది ఫేక్ అంటు శైలేంద్ర అంటాడు. కాసేపటికి మినిస్టర్ కి రిషి స్వయంగా కాల్ చేస్తాడు. మీరు అప్పగించిన సీక్రెట్ మిషన్ రహస్యంగా చెయ్యమన్నారు కదా అందుకే ఎవరికి చెప్పకుండా చేస్తున్నా అని రిషి అనగానే.. సరే నేను ఇక్కడ పరిస్థితి చక్కదిద్దుతానని మినిస్టర్ అంటాడు. ఆ తర్వాత వసుధార వెళ్తుంటే శైలేంద్ర వచ్చి.. రిషి ఎక్కడ అని అడుగుతాడు. నీకెందుకురా అంటు మహేంద్ర వచ్చి శైలేంద్రపై కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.