English | Telugu

లైవ్ లో ఏడ్చిన దీప్తి సునైనా.. షణ్ముఖ్ హార్ట్ బ్రేక్!

ఐదేళ్ల తమ ప్రేమ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు యూట్యూబ్ స్టార్స్ దీప్తి సునైనా, షణ్ముఖ్ జ‌స్వంత్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇకపై ఎవరి దారులు వాళ్లు చూసుకుంటామని.. ఎవరి కెరీర్‌పై వాళ్లు దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే తాము విడిపోతున్నట్లు ఇటీవల దీప్తి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. షణ్ముఖ్ కూడా ఆమె నిర్ణయాన్ని స్వాగతిస్తూ పోస్ట్ పెట్టాడు. నిర్ణ‌యం తీసుకునే హ‌క్కు దీప్తికి ఉంద‌ని చెప్పాడు. ఆమె చాలా క‌ష్టాలు ప‌డింద‌నీ, ఆమె సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్నానని తెలిపాడు.

దీప్తి, షణ్ముఖ్ బ్రేకప్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన దీప్తి.. బ్రేకప్‌ గురించి స్పందిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. బ్రేకప్‌ గురించి ఓ నెటిజన్‌ దీప్తిని ప్రశ్నించగా.. జీవితంలో ఎప్పటికీ ఇలాగే ఉండాలని లేదని.. కెరీర్‌పరంగా ఏదైనా సాధించాలనుకుంటున్నానని.. ఇప్పటి వరకూ నా గురించి నేను ఆలోచించుకోలేదని.. అలాగే నా కెరీర్‌ని కూడా పట్టించుకోలేదని.. కానీ ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకోవాలనుకుంటున్నానని.. కెరీర్‌లో రాణించాలనుకుంటున్నానని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానంటూ దీప్తి కన్నీరు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

మరోవైపు షణ్ముఖ్ సైతం తాజాగా ఇన్‌స్టాలో డల్ గా ఉన్న తన ఫొటోని షేర్ చేసి.. హృదయం ముక్కలైన ఎమోజీలను ఎటాచ్ చేయడం గమనార్హం.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.