English | Telugu

Brahmamudi : నీకు అన్యాయం జరిగితే నేను చూస్తూ ఉండలేను.. సుభాష్ కి ఎదురుతిరిగిన మాయ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -418 లో... కళ్యాణ్ గదిలోకి వస్తుంటాడు. మీ వదిన గురించి నువ్వు చెప్తే ఏదో అనుకున్నాను కానీ చాలా తెలివిగలది.. ఎంత తెలివి అంటే తన సవతిని తీసుకొని వచ్చి.. తన ఇంట్లోనే పెట్టుకుంటుందని అనామిక అంటుంది. వదిన అలా చేసి ఉండొచ్చు కానీ దాని వెనక ఏదో ఒక రీజన్ ఉంటుందని కళ్యాణ్ అంటాడు. ఆ మాయకి మీ అన్నయ్యకి ఆఫీషియల్ గా మ్యారేజ్ చేస్తారు.. ఇక మీ వదినకి ఇంట్లో స్థానం ఉండదు.. ఇదే జరుగుతుంది చూడమని అనామిక అంటుంది. అలా జరగడానికి వీలు లేదని కళ్యాణ్ అంటాడు.

మరోవైపు సుభాష్ ఒంటరిగా ఆలోచిస్తుంటాడు. నేను చేసిన తప్పుని కప్పిపుచ్చడానికి పాపం కావ్య ప్రాబ్లమ్ లో పడింది.. కావ్యకి మాత్రం అన్యాయం జరగకుండా చూడాలని సుభాష్ అనుకుంటాడు. అదేసమయంలో స్వప్న, కావ్య మాట్లాడుకుంటారు. నువ్వేం చేస్తున్నావ్? నీకు అర్థమవుతుందా అని కావ్యని స్వప్న తిడుతుంది. నాకు వేరే దారి లేదు.. ఆ బాబు తల్లిని తీసుకొని రాకుంటే అత్తయ్య ఇంట్లో నుండి వెళ్ళిపోతానంటుంది కదా.. ఇంకా ఏం చెయ్యాలని కావ్య అంటుంది. ఈ ప్రాబ్లమ్ కి నేనే సొల్యుషన్ చూస్తానని స్వప్నతో కావ్య అంటుంది. నీకు అన్యాయం జరిగితే మాత్రం నువ్వు సైలెంట్ గా ఉన్నా కానీ నేను మాత్రం సైలెంట్ గా ఉండలేనని స్వప్న అనుకుంటుంది. మరొకవైపు మాయతో సుభాష్ మాట్లాడుతాడు. నువ్వు ఎందుకు వచ్చావ్ ? ఆ బిడ్డ తల్లి కాదని నాకు తెలుసు.. ఎంత డబ్బు కావాలని సుభాష్ అనగానే.. నేను ఈ ఇంటికి కోడలు కావాలి.. నాకు నువ్విచ్చే డబ్బు ఎందుకని మాయ అంటుంది. నా గురించి నువ్వు చెప్పలేవు ఎందుకంటే ఆ బిడ్డ నీ బిడ్డ అని తెలుసు.. ఇంట్లో వాళ్లకు ఏం చెప్తారంటూ సుభాష్ కి మాయ ఎదురుమాట్లాడుతుంది.

మరోవైపు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్ధం కావడం లేదని సీతారామయ్య అనగా.. కావ్యకి మాత్రం అన్యాయం జరగకుండా చూడాలని ఇందిరాదేవి అంటుంది. మరుసటిరోజు మాయ కాఫీ తీసుకొని వెళ్లి అందరికి ఇస్తుంది. రుద్రాణి, ధాన్యలక్ష్మి తప్ప ఎవరు తీసుకోరు.. నాకు కావ్య చేతి కాఫీ తప్ప ఏం ఇష్టం లేదని ఇందిరాదేవి అంటుంది. మాయ, కావ్య ఇద్దరు ఒకేసారి అపర్ణకి కాఫీ తీసుకుని వెళ్తారు‌. అపర్ణ మాత్రం మాయ ఇచ్చిన కాఫీ తీసుకుంటుంది. దాంతో అందరు షాక్ అవుతారు. తరువాయి భాగంలో మాయ ప్రొద్దున లేచి అందరికి టిఫిన్ రెడీ చేస్తుంది. అపుడే రాజ్ వస్తాడు. రా రాజ్.. నీకు ఇష్టమైన టిఫిన్ చేసానని మాయ పిలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.