English | Telugu

Guppedantha Manasu : మను, ఏంజిల్ మధ్య కొత్త ప్రేమకథ.. వాళ్ళని రెచ్చగొడుతున్న శైలేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1083 లో.... మనుతో ఏంజిల్ మాట్లాడాలని వస్తుంది. నీలో ఎలాంటి రియాక్షన్ ఉండదు ఎందుకని ఏంజిల్ అడుగుతుంది. మళ్ళీ రా అప్పుడు నీకు నచ్చిన ఎమోషన్ చూపిస్తానని మను అంటాడు. నువ్వు ఎప్పుడు ఇలాగే కోపంగా ఉంటావా అని ఏంజిల్ అడుగుతుంది. నేను నార్మల్ గానే ఉన్నానని మను అంటాడు. నువ్వు ఉండడమే ఇలా ఉంటావా అని ఏంజిల్ అంటుంది. చిరాకు తెప్పించకుండా ఎందుకు వచ్చావో చెప్పమని మను అంటడు.

ఆ తర్వాత నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని ఏంజిల్ అడుగుతుంది. ప్రేమించాను.. ప్రేమిస్తూనే ఉంటాను.. నాది వన్ సైడ్ లవ్ అంటాడు. దాంతో ఏంజిల్ షాక్ అవుతుంది. ఎవరు ఆ అమ్మయి అని ఏంజిల్ అడుగుతుంది. అమ్మాయి కాదు మా అమ్మ అని మను అంటాడు. నిన్ను ఎవరైనా ప్రపోజ్ చేసారా? అయిన చెయ్యడనికి నిన్ను చూస్తానే భయపడతారని ఏంజిల్ అంటుంది. మనుని ఏంజిల్ బావ అని ప్రేమగా పిలుస్తుంది... ఏంటి అలా పిలుస్తున్నావని మను అంటాడు. నువ్వు నాకు బావవి అవుతావు కావాలంటే ఫోన్ చేసి మీ అమ్మని అడుగమని ఏంజిల్ అంటుంది. కాసేపటికి ఏంజిల్ వెళ్లిపోతు.. కిందపడుతుంది. దాంతో ఏంజిల్ చెయ్యి పట్టుకొని మను లేపుతాడు. ముందు చూసుకొని నడవాలని మను అనగానే.. ఇంకెప్పుడు నిన్ను కలవనని ఏంజిల్ కోపంగా వెళ్ళిపోతుంది.

మరొకవైపు రిషి గురించి వసుధార బాధపడుతుంటే.. అప్పుడే మహేంద్ర వచ్చి రిషి వస్తాడని అంటాడు. రిషి రాడంటూ శైలంద్ర వాళ్ళింద్దరిని రెచ్చగొట్టేలా మాట్లాడతాడు. వీళ్ళు ఆవేశంగా ఉంటేనే నాకు దొరుకుతారని శైలేంద్ర అనుకుంటాడు. ఆ తర్వాత మను దగ్గరికి శైలేంద్ర వెళ్లి.. నీ తండ్రి గురించి తెలుసుకున్నావా అంటూ తనని రెచ్చగొడతాడు. నిన్ను నా తమ్ముడిగా ధత్తత తీసుకుంటానని శైలేంద్ర అంటాడు. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అక్కడే వసుధార కూడా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.