English | Telugu

నబీల్ : నేను డబ్బుల కోసం రాలేదు.. తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలని గెలుచుకున్నాను 

బిగ్‌బాస్ సీజన్-8 లో‌ నిఖిల్, గౌతమ్ ల తర్వాత నబీల్ కే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. వైల్డ్ కార్డ్స్ రాకముందు నబీల్ ఆటతీరు వేరె లెవెల్ ఉండేది కానీ వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చాక వాళ్ళు ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడంతో నబీల్ కి స్క్రీన్ స్పేస్ తగ్గింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో టాప్-3 పొజిషన్‌లో నబీల్ ఎలిమినేట్ అయ్యాడు. ఖచ్చితంగా టైటిల్ గెలుస్తాడని ఆశతో ఉన్న నబీల్‌కి చివరికి మూడో స్థానమే మిగిలింది. అయితే ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నబీల్ చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.

హీరో, తమిళ్ బిగ్‌బాస్ హోస్ట్ అయిన విజయ్ సేతుపతి, మలయాళ నటి మంజు వారియర్ ఇద్దరూ బిగ్‌బాస్ స్టేజ్‌పై సందడి చేశారు. వారి కొత్త సినిమా విడుదలై పార్ట్ 2 డిసెంబర్ 20న రిలీజ్ కాబోతుంది. దీంతో ఆ సినిమా ప్రమోషన్స్ కోసం ఈ జోడీ వచ్చింది. ఇక వచ్చీ రాగానే నాగార్జునతో మాట్లాడుతూ విజయ్ సేతుపతి చాలా ఆనందపడ్డారు. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ నాగార్జున సార్‌ని లైవ్‌గా చూస్తున్నా.. చాలా అందంగా ఉన్నారంటూ విజయ్ చెప్పారు. ఇక మంజు వారియర్‌ని తెలుగు ఆడియన్స్‌కి పరిచయం చేస్తూ.. సౌత్‌లో చాలా మంది సూపర్ స్టార్స్ ఉన్నారు కానీ మంజు వారియర్ లేడీ సూపర్ స్టార్ అంటూ నాగార్జున చెప్పాడు.

విజయ్ సేతుపతి, మంజు వారియర్ కలిసి హౌస్‌ లోపలికి వెళ్లి నబీల్‌ని మూడో స్థానంలో బయటికి తీసుకొచ్చారు. అయితే తనని తీసుకురావడనికి విజయ్ సేతుపతి రావడం నబీల్‌కి చాలా ఆనందాన్ని ఇచ్చింది. విజయ్ సేతుపతితో పాటు స్టేజ్ మీదకి వచ్చేసిన నబీల్.. తనకి ఓటేసిన ప్రేక్షకులకి కృతజ్ఞతలు చెప్పాడు. బ్రీఫ్ కేస్ తీసుకోలేదని బాధపడుతున్నావా నబీల్ అని నాగార్జున అడిగితే.. నేను డబ్బుల కోసం రాలేదు సర్.. నాకు ఏ మాత్రం బాధలేదు. ఒకవేళ బాధ ఉండి ఉంటే.. నా ముఖంలో కనిపించేది.. తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలు గెలవాలనుకున్నాను.. అది గెలిచానంటూ నబీల్ చెప్పాడు. ఇక విజయ్ సేతుపతి, మంజు వారియల్ వెళ్లిపోతుంటే ఓ రిక్వెస్ట్ చేశాడు నబీల్. వాళ్లంతా కుళ్లుకునేలా ఓ కిస్ ఇవ్వండి సార్ అంటూ నబీల్ అడిగితే విజయ్.. నబీల్‌కి బుగ్గ మీద ముద్దు పెట్టి ఆల్ ది బెస్ట్ చెప్పారు. తన ఫ్యాన్స్‌కి విజయ్ సేతుపతి ఇలా ముద్దు పెట్టి తన అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు.