English | Telugu

గద్దర్ తో పాటు మరో ముగ్గురు సినీ గేయ రచయితలకి కోటి రూపాయిలు.. జై తెలంగాణ 

గద్దర్ తో పాటు మరో ముగ్గురు సినీ గేయ రచయితలకి కోటి రూపాయిలు.. జై తెలంగాణ 

Publish Date:Jun 2, 2025

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన 'మా భూమి'(Maa bhoomi)1979 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో ప్రజా,సినీ కవి 'గద్దర్(Gaddar)రాసిన 'బండెన్క బండిగట్టి, పదహరు బండ్లు గట్టి' అనే పాట ఎంతగా సంచలనం సృషించిందో తెలిసిందే. కవిగానే కాకుండా ఈ సాంగ్ లో నటించడం ద్వారా తెలుగు చిత్ర సీమకి ఎంట్రీ ఇచ్చి 'రంగుల కల, ఒరేయ్ రిక్షా,  జై భోలో తెలంగాణ వంటి పలు చిత్రాల్లో చిరకాలం నిలిచిపోయే పాటలు రాసాడు. తెలంగాణ రాష్ట్ర సాకారంలో భాగంగా జరిగిన ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలుస్తు, ఎన్నో ప్రజా గీతాలు రాసి తెలంగాణ ప్రజలు నిత్యం పాడుకునే సమర శoఖాల్లాంటి గీతాలని అందించాడు.   ఈ రోజు తెలంగాణ(Telangana)ఆవిర్బాదినోత్సవ వేడుకలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా  గద్దర్ కి రేవంత్ రెడ్డి  కోటి రూపాయలు ప్రకటించగా, గద్దర్ తరుపున ఆయన భార్య కోటిరూపాయలని అందుకోవడం జరిగింది. తెలంగాణకే  చెందిన సినీగేయరచయితలైన సుద్దాల అశోక్ తేజ, గోరటి వెంకన్న, అందెశ్రీ కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ పలు గీతాలని రాసారు. దీంతో వారికి కూడా చెరొక కోటిరూపాయలు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం సినీ రంగానికి సంబంధించి గద్దర్ అవార్డులని  తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2014 నుంచి 2024 వరకు రిలీజైన సినిమాలకి రీసెంట్ గా గద్దర్ అవార్డుని ప్రతి క్యాటగిరిలోను ప్రకటించారు. జూన్ 14 న ఆ అవార్డులని ఇవ్వనుంది.      
Anushka's Ghaati to limit Kingdom BO potential?

Anushka's Ghaati to limit Kingdom BO potential?

Publish Date:Jun 2, 2025

Ghaati starring Queen Anushka Shetty has been announced to release in April but now, it has been postponed to 11th July. This shift has put Vijay Deverakonda's Kingdom Box Office potential in dilemma. As the makers of Ghaati, UV Creations, will ensure good theatres to be locked for their film, Kingdom might face though terrain from second week.  Kingdom is releasing on 4th July and makers are confident about it being a blockbuster comeback for Vijay. As the actor is facing big downtime in his career after Arjun Reddy and Geetha Govindam highs, he needs Kingdom to start his rein at the box office, once again.  Also, the makers have stated that they spent huge budget than they first planned, so, they would be seeking a two week free run for the film before another popular star film release. But Ghaati will definitely take away many screens from the film in AP state with Anushka having a great amount of craze and market.  With Krish being the director, there would be some sort of high interest for Ghaati at least in the opening weekend. So, this seems to effect Kingdom long run potential if it attains positive word of mouth after release. Well, this move has also put Nithiin's Thammudu release in further doldrums.  Dil Raju, the producer of Thammudu, might look at August month to give their film a possible two weeks time to recover the budget. Looks like July will have a packed schedule more than June with mid-range star films not looking to clash with big releases in August and September, like Coolie, Akhanda 2, War 2.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

పరాజయాలతో మొదలై.. దిగ్గజ దర్శకుడిగా ఎదిగిన మణిరత్నం!

Publish Date:Jun 2, 2025

  సినీ పరిశ్రమకు వచ్చి పేరు తెచ్చుకోవాలనుకున్న ఏ దర్శకుడైనా ఒక విభిన్నమైన సినిమాతో ఎంట్రీ ఇవ్వాలనుకుంటారు. ఆ విధంగా తనదైన ముద్ర వెయ్యాలని భావిస్తారు. అయితే కొన్నిసార్లు కథ, కథనాలు, దర్శకత్వం ఎంత విభిన్నంగా ఉన్నప్పటికీ అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవు. అతను తన సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు అనే విషయం అర్థం కాదు. భారతదేశంలో అత్యుత్తమ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న మణిరత్నం విషయంలో ఇదే జరిగింది. ప్రేక్షకుల అభిరుచికి భిన్నంగా సినిమాలు తియ్యడం ద్వారా ఒక దశలో మణిరత్నం అంటే నిర్మాతలు భయపడేవారు. ఆ స్థితి నుంచి మణిరత్నంలాంటి టాలెంటెడ్‌ డైరెక్టర్‌తో ఒక్క సినిమా అయినా చెయ్యాలి అని కోరుకునేంత పెద్ద దర్శకుడుగా మారారు మణిరత్నం. భారతదేశం గర్వించదగ్గ దర్శకుడుగా పేరు తెచ్చుకోవడం వెనుక మణిరత్నం కృషి ఏమిటి? దర్శకుడుగా మొదటి అవకాశాన్ని ఎలా సంపాదించారు? ఆయన సినీ ప్రస్థానం ఎలా కొనసాగింది అనే విషయాలు తెలుసుకుందాం.   1956 జూన్‌ 2న తమిళనాడులోని మధురైలో జన్మించారు మణిరత్నం. ఆయన పూర్తి పేరు గోపాలరత్నం సుబ్రమణ్యం. తండ్రి గోపాలరత్నం వీనస్‌ పిక్చర్స్‌లో ఫిలిం డిస్ట్రిబ్యూటర్‌గా ఉండేవారు. మణిరత్నం మేనమామ కృష్ణమూర్తి వీనస్‌ పిక్చర్స్‌ అధినేత. సినిమా కుటుంబమే అయినప్పటికీ పిల్లలను సినిమాలు చూడనిచ్చేవారు కాదు గోపాలరత్నం. అయినా ఇంట్లో తెలియకుండా సినిమాలు చూసేవారు మణిరత్నం. అప్పట్లో శివాజీగణేశన్‌ నటించిన సినిమాలు, కె.బాలచందర్‌ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలను ఎక్కువగా ఇష్టపడేవారు. 1977లో ముంబాయిలో ఎంబిఎ పూర్తి చేశారు. ఆ తర్వాత మద్రాస్‌లో మేనేజ్‌మెంట్‌ కన్సల్‌టెంట్‌గా ఉద్యోగం చేశారు. అయితే మణిరత్నం ఉద్యోగంలో ఇమడలేకపోయారు. ఒక సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్‌ డిస్కషన్స్‌లో కొన్నాళ్ళు పాల్గొన్నారు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాలపై దృష్టి పెట్టాలనుకున్నారు. ఆ సమయంలోనే పి.సి.శ్రీరామ్‌ పరిచయమయ్యారు. అప్పటికి అతను సినిమాటోగ్రాఫర్‌ అవ్వలేదు. ఇద్దరూ తరచూ కలుసుకొనేవారు. సినిమాలకు సంబంధించిన చర్చలు చేసేవారు. అప్పుడు సినిమాలు విపరీతంగా చూడడం మొదలుపెట్టారు మణిరత్నం. ముఖ్యంగా భారతీరాజా, కె.బాలచందర్‌, మహేంద్రన్‌ సినిమాలు చూడడం ద్వారా కథ, కథనాల విషయంలో ఎన్నో మెళకువలు నేర్చుకున్నారు. అలా కొన్ని కథలు కూడా రాసుకున్నారు. వాటిలో తనకు బాగా నచ్చిన కథతో ఆ ముగ్గురు దర్శకులను కలిశారు. వారికి మణిరత్నం రాసిన కథ నచ్చలేదు. దాదాపు మూడు సంవత్సరాలపాటు 20 మంది నిర్మాతలకు ఆ కథ వినిపించినా సినిమా చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.    మణిరత్నం కష్టం చూసిన ఆయన మేనమామ కృష్ణమూర్తి ఓ చిన్న సినిమా చేసేందుకు ముందుకొచ్చారు. అయితే ఆ సినిమా కన్నడలో చెయ్యాలని, తన బడ్జెట్‌ని మించి చేయకూడదని చెప్పారు. అప్పుడు అనిల్‌కపూర్‌, లక్ష్మీ ప్రధాన పాత్రల్లో ‘పల్లవి అను పల్లవి’ అనే సినిమా చేశారు. 1983లో విడుదలైన ఈ సినిమా ఏవరేజ్‌ అనిపించుకుంది. అయితే ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌గా మణిరత్నం కర్ణాటక స్టేట్‌ అవార్డు అందుకున్నారు. తర్వాత మలయాళంలో ‘ఉన్నరూ’ అనే సినిమా చేశారు. అది ఫ్లాప్‌ అయింది. 1985లో ‘పగల్‌ నిలవు’, ‘ఇదయ కోవిల్‌’ అనే తమిళ్‌ సినిమాలు చేశారు. అవి కూడా విజయం సాధించలేదు. పల్లవి అనుపల్లవి సినిమా చేస్తున్న సమయంలోనే దివ్య పేరుతో ఓ కథ రాసుకున్నారు మణిరత్నం. అప్పటికి సక్సెస్‌ అనేది లేకపోవడంతో ఆయనతో సినిమా చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో మణిరత్నం అన్నయ్య వెంకటేశ్వరన్‌ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యారు. తను రాసుకున్న దివ్య కథతోనే సినిమా చెయ్యాలనుకున్నారు. మోహన్‌, రేవతి, కార్తీక్‌ ప్రధాన పాత్రల్లో ప్రారంభమైన ఈ సినిమాకి ‘మౌనరాగం’ అనే టైటిల్‌ పెట్టారు. ఈ సినిమాకి పి.సి.శ్రీరామ్‌ను సినిమాటోగ్రాఫర్‌గా తీసుకున్నారు. 1986లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించి దర్శకుడుగా మణిరత్నంకు మంచి పేరు తెచ్చింది. తెలుగులో కూడా ఇదే పేరుతో రిలీజ్‌ అయి సూపర్‌హిట్‌ అయింది. ఈ సినిమాలోని పాటలన్నీ పెద్ద హిట్‌ అయ్యాయి. ఈ సినిమాకి ఉత్తమ దర్శకుడుగా ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నారు మణిరత్నం. ఆ తర్వాత 1970లో విడుదలై సూపర్‌హిట్‌ అయిన హిందీ సినిమా ‘పగ్లా కహీ కా’ చిత్రాన్ని కమల్‌హాసన్‌తో రీమేక్‌ చెయ్యాలనుకున్నారు. కానీ, కమల్‌ ఆ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. ఏదైనా కొత్త కథ చెప్పమని మణిరత్నంని అడిగారు. 1975 నుంచి 1977 వరకు ముంబాయిలో ఎంబిఎ చదువుతున్న రోజుల్లో వరదరాజన్‌ ముదలియార్‌ అక్కడ అండర్‌ వరల్డ్‌ డాన్‌గా ఉండేవాడు. అతన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని తయారు చేసిన కథను కమల్‌కు వినిపించారు మణిరత్నం. అది ఆయనకు బాగా నచ్చింది. 1987లో ‘నాయకన్‌’ పేరుతో ఈ చిత్రాన్ని రూపొందించారు. తమిళ, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించడమే కాకుండా కమల్‌హాసన్‌కు ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. ఈ ఒక్క సినిమాతో జాతీయ స్థాయిలో అందరూ చర్చించుకునే స్థాయికి మణిరత్నం చేరుకున్నారు.   తను చేసే ప్రతి సినిమా ఒక దృశ్యకావ్యంలా ఉండాలని తపించేవారు మణిరత్నం. దానికి తగ్గట్టుగానే సినిమాలను రూపొందించారు. భారతీయ సినిమాలో ఎంతో మంది దర్శకులు ఉన్నప్పటికీ మణిరత్నం శైలి వేరు. ఆయన సినిమాలోని పాత్రలు, వాటి తీరుతెన్నులు ఎంతో భిన్నంగా ఉంటాయి. ప్రతి ఫ్రేమ్‌ అందంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి సన్నివేశం ప్రేక్షకుల మనసులో నిలిచిపోయేలా తీర్చిదిద్దుతారు. తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో మణిరత్నం రూపొందించిన సినిమాలన్నీ ఇదే తరహాలో ఉంటాయి. ‘నాయకన్‌’ తర్వాత ప్రభు, కార్తీక్‌ హీరోలు రూపొందించిన ‘అగ్నినక్షత్రం’ సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమా తెలుగులో ‘ఘర్షణ’ పేరుతో విడుదలైంది. ఈ సినిమా తర్వాత నాగార్జునతో మణిరత్నం చేసిన ‘గీతాంజలి’ ఒక అందమైన దృశ్యకావ్యంగా నిలిచింది. నాగార్జున కెరీర్‌లో ఒక మైల్‌స్టోన్‌గా నిలిచింది.    ఆ తర్వాత అంజలి, దళపతి వంటి సినిమాలు మణిరత్నంను ఇండియాలోనే టాప్‌ డైరెక్టర్‌గా నిలబెట్టాయి. ఇక ఆయన కెరీర్‌లో మరో మరపురాని సినిమా రోజా. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మణిరత్నం పేరు మారుమోగిపోయింది. ఇక అప్పటి నుంచి మణిరత్నంకి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ ఏర్పడిరది. ఆయన నుంచి వచ్చే సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసేవారు. జయాపజయాలతో సంబంధం లేకుండా మణిరత్నం సినిమాలను ఆదరించారు. అలా దొంగ దొంగ, బాంబే, ఇద్దరు, దిల్‌సే, సఖి, యువ, గురు, రావణ్‌, చెలియా, ఓకే బంగారం వంటి అద్భుతమైన దృశ్యకావ్యాలను ప్రేక్షకులకు అందించారు. వాటిలో కొన్ని బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోయినా 2022లో వచ్చిన పొన్నియన్‌ సెల్వన్‌1తో తనేమిటో మరోసారి నిరూపించుకున్నారు మణిరత్నం. ఆ తర్వాత 2023లో  విడుదలైన పొన్నియన్‌ సెల్వన్‌2 కూడా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించాయి. తాజాగా కమల్‌హాసన్‌తో రూపొందించిన ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం జూన్‌ 5న విడుదల కాబోతోంది. 38 సంవత్సరాల గ్యాప్‌ తర్వాత కమల్‌హాసన్‌తో రూపొందించిన ఈ సినిమా మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది.    జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మణిరత్నం ఎన్నో పురస్కారాలు అందుకున్నారు మణిరత్నం. పద్మశ్రీ అవార్డుతోపాటు నేషనల్‌ అవార్డులు, నంది అవార్డులు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులు, అంతర్జాతీయ స్థాయి అవార్డులు అనేకం ఆయన్ని వరించాయి. తాజాగా ప్రకటించిన గద్దర్‌ అవార్డులలో పైడి జైరాజ్‌ స్పెషల్‌ జ్యూరీ అవార్డుకు మణిరత్నంను ఎంపిక చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే.. 1988లో కమల్‌హాసన్‌ సోదరుడు చారు హాసన్‌ కుమార్తె, ప్రముఖ హీరోయిన్‌ సుహాసినిని వివాహం చేసుకున్నారు మణిరత్నం. వీరికి ఒక కుమారుడు నందన్‌. దర్శకుడిగానే కాదు, నిర్మాతగా మద్రాస్‌ టాకీస్‌ బేనర్‌పై ఎన్నో సినిమాలు నిర్మించారు మణిరత్నం.   (జూన్‌ 2 దర్శకుడు మణిరత్నం పుట్టినరోజు సందర్భంగా..)  

మూడో భార్యని కలవడానికి ముందు థెరపీ చేయించుకున్నాను..దటీజ్ అమీర్ ఖాన్ 

Publish Date:Jun 2, 2025

భారతీయ సినీప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు 'అమీర్ ఖాన్'(Aamir Khan). సుదీర్ఘ కాలం నుంచి ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాల్లో నటిస్తు అశేష అభిమానులని సంపాదించాడు. ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రాల జాబితాలో అమీర్ నటించిన 'దంగల్' మూవీనే ఉందంటే అమీర్ ప్రభావం ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. వ్యక్తి గత విషయానికి వస్తే తన రెండో భార్య 'కిరణ్ రావు' నుంచి విడాకులు తీసుకున్న అమీర్, చాలా కాలంగా ఒంటరిగానే ఉంటు వస్తున్నాడు. కానీ మార్చిలో జరిగిన తన 60 వ పుట్టిన రోజు సందర్భంగా' గౌరీ స్ప్రాట్ '(Gauri Spratt)అనే ఆమెతో డేటింగ్ లో ఉన్నట్టుగా చెప్పుకొచ్చాడు. రీసెంట్ గా ఈ విషయంపై అమీర్ మాట్లాడుతు  నేను 'గౌరీ' ని కలవడానికి ముందుకు థెరపీ చేయించుకున్నాను. దీంతో  నా ఆరోగ్యంపై దృష్టి పెట్టి, నన్ను నేను ప్రేమించుకోవడం ప్రారంభించాను. అనుకోకుండా కలిసిన మా ఇద్దరి మధ్య కొన్నాళ్లకి ప్రేమ పుట్టింది. గౌరీ, నేను భార్య భర్తలం కాకపోవచ్చు. కానీ ఎప్పటికి కలిసే ఉంటాం. పిల్లలు, తల్లి తండ్రులు ఉన్నారు కదా, భాగస్వామ్యం  అవసరం ఏముందని అనుకున్నాను. కానీ గౌరీ ప్రేమతో అవసరం తెలిసింది. నా స్నేహితులు కూడా ప్రతి విషయంలో మద్దతుగా నిలిచారని    చెప్పుకొచ్చాడు.   బెంగళూరుకు చెందిన గౌరీ లండన్ లో ఎఫ్‌డీఏ 'స్టైలింగ్ అండ్ ఫోటోగ్రఫీ'లో శిక్షణ పొందింది. ముంబై, బెంగళూరులలో గౌరీ కుటంబానికి కొన్ని సెలూన్స్ ఉన్నాయి.అమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ లో  చాలా కాలం నుంచి పని చేస్తూ వస్తుంది. ఆమెకు ఆరేళ్ల పాప కూడా  ఉంది. ఇక అమీర్ అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే ఈ నెల 6 న 'తారే జమీన్ పర్' కి సీక్వెల్ గా తెరకెక్కిన 'సితారే జమీన్ పర్' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తర్వాత తన కలల ప్రాజెక్టు 'మహాభారతం' ని తెరకెక్కించాలనే పట్టుదలతో అమీర్ ఉన్నాడు.  

మహేష్ బాబుతో డేటింగ్ చేయాలని ఉంది..

Publish Date:Jun 2, 2025

  ఐశ్వర్య పిస్సే బుల్లితెర ముద్దబంతి. ఈ మధ్య కాలంలో ఎన్నో షోస్ లో కనిపిస్తోంది. ఐతే ఒక చిట్ చాట్ ఎపిసోడ్ ఆమె ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. అదేంటో తెలుసా.." "నేను కన్నడలో ఆర్కా మీడియా వాళ్లకు సీరియల్ చేస్తున్నాను. ఇక్కడ మాత్రం ఆర్కా మీడియాకి మంచి పేరుంది అలాగే పెద్ద ప్రొడక్షన్ హౌస్ కూడా దాంతో వాళ్ళే నన్ను తెలుగులో ఇంట్రడ్యూస్ చేశారు. నేను మొదట ఈటీవీలోనే నా పేరు మీనాక్షి సీరియల్ చేసాను. అలా వచ్చింది అవకాశం. టాలీవుడ్ ఎప్పటికైనా నా క్రష్ మహేష్ బాబు...డేటింగ్ చేసే అవకాశం వస్తే మహేష్ బాబుతోనే డేటింగ్ చేస్తాను. కాలేజ్ లో నేను చేసిన క్రేజి థింగ్ నేను ఫస్ట్ పీరియడ్ కి అసలు వెళ్లేదాన్ని కాదు..నా కోసం వెయిట్ చేస్తూ నా ఫ్రెండ్స్ కూడా కాలేజీ బంక్ కొట్టేవాళ్ళు. అలా బంక్ కొట్టి సినిమాకు వెళ్లాం. సీరియల్స్ చేస్తూ ఇక్కడి వరకు వచ్చాను కాబట్టి సీరియల్స్ అంటే చాల ఇష్టం. అప్పుడప్పుడు టీవీ షోస్ కి కూడా వెళ్తూ ఉంటాను. నా లైఫ్ లో రిటర్న్ రావాలి అని అనుకోవడం లేదు.. అన్నీ కరెక్ట్ గానే జరుగుతున్నాయి. ఫ్యూచర్ లో మంచి పాపులర్ అవ్వాలి. అందరూ నన్ను పొగడాలి...నా యాక్టింగ్ ని అందరూ ఇష్టపడాలి. మైథలాజికల్ క్యారెక్టర్ చేయడం నా డ్రీం రోల్. నన్ను తక్కువ చేసి మాట్లాడేవాళ్ళను నిలబెట్టి మాట్లాడదామనుకుంటాను కానీ ఎప్పుడూ నిలదీయను. మూవీస్ చేయాలి అంటే లక్ ఉండాలి. అక్కడ లక్ దొరుకుతుందో లేదో తెలీదు కానీ సీరియల్స్ చేయడమే నాకు కంఫర్ట్ గా ఉంటుంది.  నేను ఇక్కడ ఉండిపోతాను. తెలుగు, కన్నడ నుంచి బిగ్ ప్రాజెక్ట్స్ వస్తే తెలుగులో ఎక్కువ ప్రాజెక్ట్స్ చేస్తున్నా కాబట్టి తెలుగునే ఎంచుకుంటాను. నేను మేకప్ చేసుకునేటప్పుడు కానీ ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా అదే పనిగా చూస్తే మాత్రం వాళ్ళు ఎవరు అని కూడా చూడకుండా తిట్టేస్తాను. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో మాకు ఏమీ తెలిసేది కాదు. మేము ఎం చేయకపోయినా పెద్ద ఆర్టిస్టులను తిట్టలేక మమ్మల్ని తిట్టేవాళ్ళు ..ఆ విషయం చాల ఇబ్బందిగా అనిపించేది." అంటూ చెప్పుకొచ్చింది.

Nazeeruddin Shaik wins aha Telugu Indian Idol 3

Publish Date:Sep 23, 2024

In a thrilling grand finale streamed on aha OTT, 19-year-old Nazeeruddin Shaik from Andhra Pradesh emerged victorious as the winner of aha Telugu Indian Idol Season 3. His captivating performances throughout the competition earned him both the prestigious title and a cash prize of Rs. 10 lakh. Recently clearing his CA intermediate examinations, Nazeeruddin also received the exciting opportunity to lend his voice to the highly anticipated upcoming film starring Pawan Kalyan, OG. His remarkable journey to victory was characterised by consistent excellence, which endeared him to both the audience and the judges. Anirudh Suswaram secured second place, winning Rs. 3 lakh, while GV Shri Kerthi claimed third place with a prize of Rs. 2 lakh. The show, which concluded after nearly 26 weeks of fierce competition, was judged by the esteemed Thaman S, Geetha Madhuri, and Karthik, all of whom noted that this season showcased extraordinary talent. Judge Geetha Madhuri said, "aha Telugu Indian Idol Season 3 was an incredible experience filled with talented contestants. It truly felt like a celebration of music. Choosing the finalists was extremely challenging, and every elimination was painful." Nazeeruddin was born on November 2, 2004, in Tadepalligudem to Shaik Baji, a motor mechanic, and Madeena Beebi, who passed away a year ago. His sister, Vahida Rehman, has stepped in to support him after their mother's passing. He completed his schooling at Vignana Vikas E.M School and continued his education at GSR E.M School. He pursued his Junior College and CA Intermediate at Sri Medha Commerce College in Guntur, aspiring to become a Chartered Accountant while nurturing his passion for music. Nazeeruddin's musical journey has been profoundly shaped by his maternal grandparents, Kasim Saheb and Fatima Bee. His maternal grandmother, a Carnatic music guru, played a pivotal role in cultivating his talent. Growing up listening to the iconic songs of Ghantasala ignited his dedication to music. Reflecting on his victory, Nazeeruddin shared, "My journey with music began when I was just four years old. It was my grandfather, Kasim garu, and his sister whom I affectionately call Nani, who introduced me to this world. She enrolled me in Carnatic music lessons, while my grandfather taught me the nuances of cinematic music. Having sung for Ghantasala garu, his admiration for him has never wavered. For 47 years, he has honored Ghantasala's memory by observing his death anniversary in our village, Tadepalligudem. Thanks to my grandfather's efforts, a statue of Ghantasala garu stands in our village." "Winning the title of Telugu Indian Idol Season 3 is a key milestone for me. Performing in front of Thaman sir, Geetha Madhuri ma’am, and Karthik sir was an honor. Their feedback, along with lessons from my fellow contestants, has shaped my growth as a singer. Moving forward, I aim to be a leading musician in the industry while pursuing a career in finance, " he added. The competition began with over 15,000 aspiring singers, showcasing immense talent throughout the season. Initial auditions took place on May 4, 2024, in New Jersey and Hyderabad. The top 12 finalists included Bharat Raj, Keerthana, Keshav Ram, Hari Priya, GV Shri Kerthi, Nazeeruddin, Skanda, Duvvuri Sridhruthi, Rajani Sree, Sai Vallabha, Khushal Sharma, and Anirudh Suswaram. After rigorous eliminations and public voting across 28 episodes, the competition culminated in a final showdown featuring the top five contestants: Anirudh Suswaram, Skanda, Keerthana, Sri Keerthi, and Nazeeruddin. The finalists dazzled in vibrant attire during the blockbuster finale, which included special performances from the judges and contestants. Judge Geetha Madhuri, in a striking red outfit, captivated the audience with her exceptional performance. The Judges Thaman and Karthik also presented outstanding performances during the blockbuster finale episode. The blockbuster finale, streamed on September 20-21, 2024, celebrated the remarkable journeys of these talented singers. If you missed the thrilling finale episode, catch it now only on aha.

అఖిల్‌ అక్కినేని.. ఎంగేజ్‌మెంట్‌ సీక్రెట్‌గా చేసుకున్నాడు.. పెళ్లి కూడా అంతేనా?

Publish Date:May 27, 2025

1980 దశకం నుంచి హీరోలుగా కొనసాగుతున్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లలో వివాహాలు అంతగా కలిసిరాని కుటుంబం నాగార్జునదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నాగార్జున మొదలుకొని అఖిల్‌ వరకు అందరూ పెళ్లి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. నాగార్జున విషయమే తీసుకుంటే మొదటి భార్యకు విడాకులు ఇచ్చి అమలను వివాహం చేసుకున్నారు. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు అన్యోన్యమైన జంటగా నాగార్జున, అమల పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నాగచైతన్య వివాహం సమంతతో జరిగింది. కొన్నాళ్లు సజావుగానే సాగిన వీరి వైవాహిక జీవితం విడాకులతో ముగిసింది. ఇటీవల నాగచైతన్య వివాహం శోభితతో జరిగిన విషయం తెలిసిందే. నాగచైతన్య కంటే ముందు 2016లో అఖిల్‌ వివాహం ప్రముఖ వ్యాపార వేత్త జి.వి.కృష్ణారెడ్డి మనవరాలు శ్రీయా భూపాల్‌తో నిశ్చయమైంది. వీరి ఎంగేజ్‌మెంట్‌ ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో 2017లో ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్నారు.  7 సంవత్సరాల గ్యాప్‌ తర్వాత ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త జుల్ఫీ రవ్ద్‌జీ కుమార్తె జైనాబ్‌ రవ్ద్‌జీతో ప్రేమాయణం నడిపారు అఖిల్‌. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించడంతో గత ఏడాది నవంబర్‌ 26న ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. నాగచైతన్య, శోభిత వివాహ సమయంలోనే వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వకుండా చాలా సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ జరుపుకున్నారు. పెళ్లి ఎప్పుడు అనేది కూడా ఎక్కడా రివీల్‌ చెయ్యలేదు. అఖిల్‌, జైనాబ్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కి ప్లాన్‌ చేసుకుంటున్నారని సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి అక్కినేని ఫ్యామిలీ ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు జూన్‌ 6న అఖిల్‌, జైనాబ్‌ వివాహం జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే పెళ్లి పనులు మొదలుపెట్టేశారని సమాచారం.  వీరి వివాహంపై రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. పెళ్లి హైదరాబాద్‌లోనే జరుగుతుందని కొందరంటుంటే, రాజస్థాన్‌లోని ఓ ప్యాలెస్‌లో ప్లాన్‌ చేశారని మరికొందరు అంటున్నారు. వీరి వివాహంపై సోషల్‌ మీడియాలో చర్చలు బాగా జరుగుతున్నాయి. ఎంగేజ్‌మెంట్‌ సీక్రెట్‌గా చేసుకున్నారు, ఇప్పుడు పెళ్లి కూడా సీక్రెట్‌గానే చేసుకోబోతున్నారనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్తలో నిజం ఉన్నట్టుగానే కనిపిస్తోంది. ఎందుకంటే జూన్‌ 6న పెళ్ళి జరుగుతుంది అనుకుంటే ఇంకా పది రోజులు మాత్రమే సమయం ఉంది. అక్కినేని ఫ్యామిలీ దీనిపై ఎలాంటి హడావిడి చేయడం లేదు అంటే ఎంగేజ్‌మెంట్‌లాగే అఖిల్‌ పెళ్ళి కూడా రహస్యంగానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Sudha Kongara & Hombale project is going to be Biggest Multistarrer

Publish Date:Jul 12, 2022

Even though it came before 'KGF,' Hombale Films became well-known with that film. The films are being announced, completed, and ready for release as a result of the momentum created by that film. Production is currently working on 'Salaar' in Telugu and 'Tyson' in Malayalam. Other pan-India films have also just been announced.   However, a film directed by Sudha Kongara was recently announced. Except for the fact that they stated that it will be a big film, they did not mention the casting. There are some new rumours floating around about this. If those rumours are true, this combination will be spectacular. According to sources, Sudha Kongara project is going to be multi starrer.  Furthermore, the names of those heroes are currently being spread.   According to the latest rumours, this film would star Suriya and Dulquer Salman, who have established as star heroes in the South with a string of superhits. According to industry reports, Surya, who has become acquainted of Sudha Kongara's direction in 'Akaasham Nee Haddura,' responded OK without even hearing the story. It is stated that discussions about this film are ongoing, and that full details will be released soon. Pre-production work will begin soon.   Hombale is synonymous with big-budget films. This film is expected to be in the same budget range as the previous one. Suriya's film is also popular in Telugu. Dulquer films have a cult following in the South. This combination is surely going to be crazy.

Ranbir and Alia in love

Publish Date:May 10, 2018

భైరవం

Publish Date:May 30, 2025

శుభం

Publish Date:May 9, 2025

సింగిల్

Publish Date:May 9, 2025

హిట్ 3

Publish Date:May 1, 2025

రెట్రో

Publish Date:May 1, 2025

Bhairavam

Publish Date:May 30, 2025

Subham

Publish Date:May 9, 2025

Single

Publish Date:May 9, 2025

Hit 3

Publish Date:May 1, 2025

Retro

Publish Date:May 1, 2025