English | Telugu

ధనరాజ్ కి పెళ్ళిచూపులు.. రంగాని చూసి షాకైన ఆ ఇద్దరు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1131 లో....బుజ్జి సరోజ కలిసి పెళ్లిచూపులు చెడగొట్టడానికి ప్లాన్ చేస్తారు. బుజ్జి పెళ్లి వాళ్లు వచ్చే దార్లో ఉంటాడు. శైలేంద్ర, ధనరాజ్, దేవయానిలు వచ్చే కార్ ఆపుతారు. సరోజ నేను లవర్స్ అని బుజ్జి చెప్తాడు. ప్రూఫ్ అంటూ సరోజ రంగాతో ఉన్న ఫోటోని వాళ్లకు చూపించగానే.. రంగాని చూసి దేవయాని, శైలేంద్రలు షాక్ అవుతారు. ఎవరు అతనని శైలేంద్ర అంటాడు. సరోజ బావ రంగా అని బుజ్జి చెప్పగానే.. పదండి ఇక ఈ సంబంధం కూడా క్యాన్సల్ అయినట్లే అని ధనరాజ్ అంటాడు.

Guppedantha Manasu : కొంపముంచిన బుజ్జీ.. ఆ ఫోటో చూసి షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1130 లో.. శైలేంద్ర ఇంటికి ధనరాజ్ వస్తాడు. అన్నయ్య మీరు నాకు హెల్ప్ చెయ్యాలి. ఏదో కష్టపడి కొంచెం సంపాదించుకున్నాను కానీ నాకు ఒకటే లోటు పెళ్లి అవట్లేదని శైలేంద్ర, దేవయానిలతో ధనరాజ్ అంటాడు. అయితే మేమ్ ఏం చేస్తామని శైలేంద్ర అంటాడు. మీరు ఒక హెల్ప్ చేయాలి.. ఏంటంటే నన్ను చూసి అందరు సంబంధం ఒకే చేస్తున్నారు కానీ నాకు ఎవరు లేరని రిజెక్ట్ చేస్తున్నారు. అందుకే నాకు ఒక సంబంధం వచ్చింది. వాళ్ళకి నాకు ఒక అన్నయ్య, అమ్మ ఉన్నారని చెప్పాను.. అది మీరే కాస్త పెళ్లి చూపులకు నాతో రండి అని ధనరాజ్ అంటాడు.

షోస్ వదిలేసి పొలం పనుల్లోకి యాంకర్ సుమ

​సుమ ఎం మాట్లాడిన ఎం చేసినా వెరైటీగా  ఉంటుంది. ఇప్పుడు సుమ టీవీని వదిలిపెట్టి పొలాల్లో పంట పండించడానికి వెళ్ళింది. అదేంటి అనుకుంటున్నారా..నిజం అండి. సుమ రైతక్కలతో కలిసి ఆడుతూ పాడుతూ వ్యవసాయం చేసింది. మనం రోజూ తినే ఆహారం వెనక రైతుల కష్టం ఏంటో ఉంది అంటూ వాళ్లకు సెల్యూట్ చేసింది. పొలంలోకి దిగి వరి డబ్బులు నాటింది. "ఒక గంట పని చేస్తేనే నేను అలిసిపోయాను. రోజంతా నడుం వంచి పని చేసే వీళ్లకు ఎంత బలం ఉండాలో..నిజంగా ఇంటి పనులను, వ్యవసాయాన్ని ఇలా సమర్ధించుకుంటూ చేయడం చాలా గొప్ప విషయం..వాళ్లందరికీ నా జోహార్లు.." అంటూ వాళ్లకు దణ్ణం పెట్టింది సుమ. ఈ వీడియోని సుమ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "నాకు వ్యవసాయం ఎప్పుడూ ఒక గొప్ప అనుభూతిగా ఉంటుంది.

అంబానీకి పెళ్లి అప్పులు... ప్రజల్ని కట్టమంటున్న జ్యోతిరెడ్డి

  అంబానీ ఇంట పెళ్లి రోజూ ఎదో ఒక అంశంలో టాప్ హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ఎందుకంటే అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లి మాములుగా జరిగిందా మరి. రెండు ప్రీవెడ్డింగ్ షూట్లు, అన్ని ఇండస్ట్రీల నుంచి సెలబ్రిటీస్ ని పిలవడాలు, వాళ్లకు గిఫ్టులు...అబ్బూ ఆ  హడావిడి మాములుగా లేదు. 5 వేల కోట్ల రూపాయల ఖరీదైన పెళ్లి మరి. ఇన్ని కోట్ల పెళ్లి అంటే మరి భారీగానే అప్పులయ్యి ఉంటాయి కదా..పెళ్ళికి ముందే జియో చార్జెస్ పెంచడంతో ఈ రెండు అంశాలను లింక్ పెట్టి మరీ అంబానీ ఫ్యామిలీని ఆడేసుకుంటున్నారు జనాలు, నెటిజన్లు. ఇప్పుడు బుల్లితెర నటి జ్యోతిరెడ్డి కూడా ఫుల్ గా కామెంట్ చేస్తూ ఒక రీల్ ని రిలీజ్ చేసింది.

నిఖిల్-రీతూ మధ్య గొడవ...అనసూయను తిడుతున్న నెటిజన్స్

కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో నిఖిల్-రీతూ మధ్య గొడవ జరిగింది. ఈ వారం కుకింగ్ థీమ్ లో చాలా కాన్సెప్ట్స్ ఇచ్చింది శ్రీముఖి. అందులో బాయ్స్ అండ్ గర్ల్స్ మధ్య బత్తాయి రసం తీసే పోటీ పెట్టింది. ఐతే అందులో రీతూ జ్యూస్ తీసి ఒక క్వాంటిటీ బోటిల్ లో పోసి అందులో చెయ్యి పెట్టి కెలికేసింది. తర్వాత అమరదీప్ లేచి శేఖర్ మాష్టర్ కి ఒక పాయింట్ చెప్పాడు. " మాష్టర్ ఇప్పుడు మన బాయ్స్ నుంచి ఒక సమస్య ఉంది. జ్యూస్ లో వాటర్ పోశారు అని మన బాయ్స్ చెప్తున్నారు" అనేసరికి రీతూ ముఖం మరీ గలీజ్ గా పెట్టింది. దాంతో శేఖర్ మాష్టర్ "నీళ్లు పోయడం ఎవరు చూసారు మన వాళ్ళల్లో" అని అడిగారు.

మగాడి జీవితం గోధుమపిండి లాంటిది...డిన్నర్, విన్నర్, రన్నర్ అంటున్న నూకరాజు

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. తాగుబోతు రమేష్-నూకరాజు కలిసి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ని తెగ వాడేశారు. "కృష్ణ భగవాన్ గారు ఈరోజు లంచ్ కి రూమ్ కి రమ్మన్నారు" అంటూ తాగుబోతు రమేష్ నూకరాజుకి చెప్పేసరికి "ఎందుకు" అన్నాడు. "లంచ్ కి లంచ్ కి" అన్నారు కృష్ణ భగవాన్.. "అట్టా నేను లంచ్ కి రాను డిన్నర్ కి వెళ్తా" అంటూ తాగుబోతు రమేష్ గారం పోయేసరికి దణ్ణం పెట్టారు కృష్ణ భగవాన్. "నువ్వు డిన్నర్ కి వెళ్తే విన్నర్ ఆయనే అవుతారు..నేను రన్నర్ అవ్వాల్సి వస్తుంది" అంటూ నూకరాజు కూడా దణ్ణం పెట్టేసాడు.