English | Telugu

మెడికల్ కాలేజీ పెడదామని చెప్పిన రిషి.. బస్తీలో వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -733 లో.. వసుధారని పెళ్ళి చేసుకుంటా అని రిషి అంటాడు. రిషి వాళ్ళ పెద్దమ్మ దేవయానికి చెప్పి మంచి ముహూర్తం చూడమని చెప్తాడు. ఆ తర్వాత వసుధార, రిషి ఇద్దరు కలిసి అలా బయటకు వెళ్తారు. వసుధార కార్ లో కూర్చొని రిషి తనని పెళ్లి చేసుకుంటా అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. సర్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామని వసుధార అడుగుతుంది. ఎంతసేపు మనమిద్దరం ఇలా వెళ్ళాలనిపిస్తే అంత సేపు వెళదామని రిషి చెప్తాడు.... 

ఆ అమ్మాయి ఎవరైనా.. బ్యాక్ గ్రౌండ్ ఏదైనా నేను మీ పెళ్ళి చేస్తాను!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -127 లో.. కృష్ణ, మురారి ఇద్దరు రెస్టారెంట్ లో మాట్లాడుకుంటారు. కూల్ డ్రింక్ ఎక్స్ ట్రా ఆర్డర్ చేసిన కృష్ణ.. ఇక్కడికి ఇంకొకరు వస్తున్నారని మురారికి చెప్తుంది. ఇంతలోనే గౌతమ్ అక్కడికి వస్తాడు. సర్ మీరు ఇద్దరు మేజర్ లకు పెళ్లి చేస్తానని మాట ఇచ్చారు కదా.. ఇదిగో గౌతమే ఆ అబ్బాయని, ఒక అమ్మాయిని ఈ గౌతమ్ ఇష్టపడ్డాడని కృష్ణ చెప్తుంది . అవునా ఆ అమ్మాయి ఎవరైనా సరే.. బ్యాక్ గ్రౌండ్ ఏదైనా సరే.. నేను మీ ఇద్దరి పెళ్ళి చేస్తానని మురారి అంటాడు. ఆ అమ్మాయి నందు అని తెలిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో ఏమో అని కృష్ణ తన మనసులో అనుకుంటుంది. వెంటనే వెయిటర్ ని పిలిచి క్యాలెండర్ ని తీసుకురమ్మని మంచి రోజు చూస్తాడు మురారి. ఈ అదివారం మంచి ముహూర్తం ఉంది. మీ పెళ్లి కచ్చితంగా చేస్తానని గౌతమ్ తో మురారి చెప్తాడు.

‘బ్రహ్మముడి’ సీరియల్ లో కావ్య జర్నీ అలా మొదలైంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ ఇప్పుడు అత్యధిక టీఆర్పీ తో నెంబర్ స్థానంలో కొనసాగుతుంది. ఈ సీరియల్ లోని కనకం-కృష్ణమూర్తిల కుటుంబం ఒక మధ్యతరగతి కుంటుంబం. ఇందులో స్వప్న, కనకం ఆశలు గాల్లో ఉండగా.. కావ్య, కృష్ణమూర్తి ల ఆలోచనలు బాగుండాలి.. నిజాయితీగా ఉండాలి.. ఎవరిని నొప్పించకూడదనే విధంగా ఉంటాయి. అయితే ఈ ఫ్యామిలోని కావ్య, అప్పు, స్వప్న అందరికీ సుపరిచితమే..  కావ్య అలియాస్ దీపిక రంగరాజు ఇప్పుడు ప్రతీ కుటుంబంలో ఒక అమ్మాయిలా  మారిపోయింది. ప్రతిరోజూ దీపిక రంగరాజు తన ఇన్ స్టాగ్రామ్ లో  'బ్రహ్మముడి' సీరియల్ కి సంబంధించిన వివరాలను షేర్ చేస్తుంటుంది. 

నందు పెళ్ళి దగ్గరుండి జరిపిస్తానని మాట ఇచ్చిన మురారి! 

స్టార్ మా టీవీలో  ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -125 లో.. నందుని పెళ్ళిచేసుకోవడానికి భవాని ఇంటికి వచ్చిన అబ్బాయితో మురారి పక్కకి తీసుకెళ్ళి  మాట్లాడుతాడు. ఈ పెళ్లి అంటే మీకు ఇష్టమేనా? ఎవరైనా బలవంతం చేస్తున్నారా? అని మురారి అతడిని అడుగుతాడు. నాకు ఇష్టమే.. ఎవరు నన్ను బలవంతం చెయ్యట్లేదు.. పైగా మీ ఇంటితో సంబంధం కుదుర్చుకోవడం మా వాళ్లకి ఇష్టమని ఆ అబ్బాయి చెప్తాడు. సరే మీరు నందు గురించి తెలిసి కూడా పెళ్లి చేసుకుంటున్నారంటే దానికి మీకు థాంక్యూ అని చెప్తాడు మురారి. ఇక ఇంతలోనే ఈశ్వర్ వచ్చి మీరు మాట్లాడుకోవడం అయిపోతే కిందకి వెళ్ళండని అబ్బాయిని పంపిస్తాడు. అక్కడికి భవాని, ప్రసాద్ లు వస్తారు. మనం ఎలాగైనా అమెరికా పంపిస్తున్నాం కదా.. అదే పెళ్లి చేసి పంపిద్దామని భవాని అంటుంది. ఈ విషయం కృష్ణకి తెలియొద్దు.. తెలిస్తే నందుకి చెప్తుంది.. దాంతో నందు మారం చేస్తుంది. అందుకే కృష్ణకి తెలియనివ్వద్దు మురారి అని భవాని అంటుంది. ఇంట్లో పెళ్ళి జరిగితే తెలియకుండా ఎలా ఉంటుందని మురారి అంటాడు. ఇంతలో ముకుంద అక్కడికి వచ్చి.. ఆ విషయం నేను చూసుకుంటానని అంటుంది. నందు పెళ్లి దగ్గరుండి జరిపిస్తానని మాట ఇవ్వమని భవాని అనగానే.. భవాని చేతిలో చెయ్యి వేసి మరీ మాట ఇస్తాడు మురారి

వసుధార మెడలో తాళి లేకపోవడంతో రిషి ఫుల్ ఫైర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -731 లో.. జగతి జయచంద్రతో.. రిషి, వసుధారల గురించి చెప్తుంది. జయచంద్ర వల్ల రిషి వసుధాలు తమ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో తెలుసుకున్నారు. వసుధారని ఇక బాధ పెట్టలేను భార్యగా అంగీకరిస్తానని రిషి అనుకుంటాడు. మరోవైపు వసుధార కూడా నేను చేసిన పని వల్ల రిషి సార్ బాధ పడ్డాడు.. నన్ను భార్యగా అంగీకరిస్తాడా అంటూ ఆలోచిస్తూ నిద్రపోతుంది వసుధార. జగతి, దేవయాని ఇద్దరు వసుధార మెడలో ఉన్న తాళి గురించి గొడవపడతారు. రిషిని ఉహించుకొని మనస్ఫూర్తిగా తనని భర్తగా అనుకొని వసుధార తన మెడలో తాళి వేసుకుందని జగతి అంటుంది. దారిన పోయే వాళ్ళందరూ ఉహించుకొని మెడలో తాళి వేసుకుంటే భార్య భర్తలు అయిపోతారా అని దేవయాని అంటుంది. ఇక ఇదంతా నిద్రలో కలకంటూ నా తాళిని ఏం చెయ్యొద్దంటూ కలవరిస్తుంది వసుధార. 

జయచంద్ర సూపర్ స్పీచ్.. ఒకరికొకరు గెలిపించుకున్నారు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -730 లో పెళ్లి గురించి రిషి, వసుధారలు మాట్లాడిన దానిపై జయచంద్ర  స్టూడెంట్స్ తో పాటుగా ఫాకల్టీకి పోల్ పెడతాడు. వసుధార, రిషిలకి కూడా మీలో ఎవరిది కరెక్ట్ అనిపిస్తే వాళ్ళ పేరులోని మొదటి అక్షరాన్ని పేపర్ మీద రాయమని జయచంద్ర చెప్తాడు. అందరు తమ ఒపినియన్ ని పేపర్ పై రాసి బౌల్ లో వేస్తారు. "రిషి సర్ కరెక్ట్. నేను నా వైపు నుండే అలోచించి.. ఇన్ని రోజులు బాధ పెట్టాను" అని వసుధార అనుకొని రిషి పేరు రాస్తుంది. అలాగే రిషి కూడా "వసుధార అలా చెయ్యలేకపోతే నాకు దక్కేదే కాదు కదా.. తను చేసిందే కరెక్ట్" అని రిషి అనుకొని వసుధార పేరుని రాస్తాడు. ఇద్దరు బౌల్ లో వేస్తుండగా.. మీరు ఇద్దరు ఆ పేపర్లు నాకు ఇవ్వమని జయచంద్ర తీసుకుంటాడు.