English | Telugu

ప‌వ‌న్ సినిమా... నిర్ణ‌యించుకోవాల్సింది అక్ష‌య్‌కుమారే!

తెలుగులో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, వెంక‌టేష్ న‌టించిన సినిమా గోపాల గోపాల‌. ఈ సినిమా హిందీ వెర్ష‌న్ ఓ మై గాడ్‌. ఈ చిత్రంలో అక్ష‌య్‌కుమార్ హీరోగా న‌టించారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెర‌కెక్కించారు. ఓ మై గాడ్ సీక్వెల్ కోసం ఫ‌స్ట్ పార్ట్ ని ఆదరించిన వారంద‌రూ తెగ ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా సీక్వెల్‌ను ఓటీటీలో విడుద‌ల చేస్తార‌నే ప్ర‌చారం ఎప్ప‌టి నుంచో ఉంది. వూట్‌లోగానీ, జియో సినిమాలోగానీ ఉండొచ్చ‌నే మాట కూడా వినిపిస్తోంది. ఈ సీక్వెల్‌కి అక్ష‌య్‌కుమార్ కూడా నిర్మాత‌ల్లో ఒక‌రు. మ‌రి ఈయ‌న‌కు ఈ సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయడం ఇష్టం లేద‌ట‌.

ప‌ఠాన్ స‌క్సెస్‌తో ఫేమ‌స్ అయిన సిద్ధార్థ్‌

నాలుగేళ్ల‌కు పైగా వెయిట్ చేసిన స‌క్సెస్ షారుఖ్‌కి ప‌ఠాన్ రూపంలో ద‌క్కింది. 2023జ‌న‌వ‌రి 25న విడుద‌లైన ఈ సినిమాకు అంత తేలిగ్గా మర్చిపోలేరు షారుఖ్ ఖాన్‌. దీపిక ప‌దుకోన్ నాయిక‌గా న‌టించిన సినిమా ఇది. య‌ష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. జాన్ అబ్ర‌హామ్ నెగ‌టివ్ రోల్ చేశారు. నీతు క‌పూర్ రోల్‌కి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. పోస్ట్ ప్యాండ‌మిక్ అమితంగా డ‌బ్బులు చేసిన సినిమాల్లో ప‌ఠాన్ కూడా ఒక‌టి. రిలీజ్‌కి ముందే ర‌క‌ర‌కాల వివాదాల‌లో చిక్కుకున్న ప‌ఠాన్‌, విడుద‌ల‌య్యాక మాత్రం స‌ర్వ‌త్రా పాజిటివ్ రివ్యూస్‌తో క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టింది. ప‌ఠాన్ త‌ర్వాత షారుఖ్‌కి, దీపిక ప‌దుకోన్‌కి ఎంత హై వ‌చ్చిందో ఏమోగానీ, డైర‌క్ట‌ర్ సిద్ధార్థ్ ఆనంద్‌కి మాత్రం మ‌రో రేంజ్ ఎలివేష‌న్ వ‌చ్చింది. 

స‌ల్మాన్ హీరోగా విష్ణు మూవీ... ప్లానింగ్‌లో క‌ర‌ణ్‌!

స‌ల్మాన్‌ఖాన్ హీరోగా క‌ర‌ణ్ జోహార్ ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా స‌మ‌యంలోనే ఈ వార్త బ‌య‌టికి వ‌చ్చింది. నెక్స్ట్ ఈద్‌కి స‌ల్మాన్ నుంచి ఫ్యాన్స్ కి ట్రీట్ ఈ సినిమానే అని అన్నారు. ఇప్పుడు స‌ల్మాన్ మూవీకి డైర‌క్ట‌ర్ ఇత‌నే అంటూ సౌత్ డైర‌క్ట‌ర్ పేరు వైర‌ల్ అవుతోందితెలుగులో ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పంజా సినిమాను తెర‌కెక్కించిన విష్ణువ‌ర్ధ‌న్ గుర్తున్నారా? ఈ మ‌ధ్య‌నే బాలీవుడ్‌లో షేర్‌షా తెర‌కెక్కించారు. అత‌నే ఇప్పుడు స‌ల్మాన్ సినిమాకు ఫిక్స్ అయ్యార‌ట‌అత్యంత భారీ వ్య‌యంతో స‌ల్మాన్ ఫ్యాన్స్ కి ఈద్‌కి ప‌క్కా ట్రీట్‌లాగా ఉండేట‌ట్టు తెర‌కెక్కిస్తున్నార‌ట‌. ``స‌ల్మాన్‌కీ, క‌ర‌ణ్‌కీ మ‌ధ్య గ‌త కొన్నాళ్లుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

వాల్తేరు వీర‌య్య బాలీవుడ్ క‌లెక్ష‌న్లు తెలుసా?

పొన్నియిన్ సెల్వ‌న్ టీమ్ టీమంతా ఇప్పుడు ముంబైలో ప్ర‌చారం చేస్తోంది. వాళ్ల జోరును చూసి అస‌లు ఈ మ‌ధ్య నార్త్ లో అనువాద‌మై విడుద‌లైన మ‌న సినిమాలు ఏమాత్రం వ‌సూలు చేశాయ‌నే చ‌ర్చ హైద‌రాబాద్‌లో గ‌ట్టిగానే జ‌రుగుతోంది. పొన్నియిన్ సెల్వ‌న్ ఫ‌స్ట్ పార్టుకు త‌మిళ్‌లో అద్భుత‌మైన స్పంద‌న వ‌వ‌చ్చింది. హిందీలో మాత్రం జ‌స్ట్ పాతిక కోట్ల‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ముందు నార్త్ బెల్ట్ లో చాలా త‌క్కువ క‌లెక్షన్ల‌తోనే మొద‌లైనప్ప‌టికీ, చోళుల క‌థ‌కి మంచి మౌత్ టాక్ రావ‌డంతో ఆ ఫిగ‌ర్ అయినా వ‌సూలైంది. ఈ వారంలోనే సీక్వెల్ సిద్ధ‌మ‌వుతోంది. ఫ‌స్ట్ పార్ట్ పెంచిన ఎక్స్ పెక్టేష‌న్స్ తో సెకండ్ పార్టుకి ఏమాత్రం క‌లెక్ష‌న్లు ద‌క్కుతాయో చూడాలి. 

షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ సంజ‌య్ ద‌త్‌

సంజ‌య్ ద‌త్ న‌టిస్తున్న లేటెస్ట్ సినిమా కేడీ. ప్యాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కిస్తోంది క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌. బెంగుళూరు ప‌రిస‌రాల్లో ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. ఓ బాంబ్ పేలుడు సీన్ తెర‌కెక్కిస్తుండ‌గా సంజ‌య్‌ద‌త్‌కి గాయాలు అయ్యాయ‌ట‌. మ‌ణిక‌ట్టుకి, చేతికి, ముఖానికి బాగా గాయాలైన‌ట్టు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌తో కొన్నాళ్ల‌పాటు షూటింగ్‌కి విరామం ప్ర‌క‌టించారు మేక‌ర్స్. ఫైట్ మాస్ట‌ర్ డాక్ట‌ర్ ర‌వి వ‌ర్మ ఫైట్లు కంపోజ్  చేస్తున్నారు. బెంగుళూరు మ‌గ‌ది రోడ్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. సంజ‌య్ ద‌త్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఫ్యాన్స్ పూజ‌లు చేస్తున్నారు.

సిద్ధార్థ్‌తో జోడీ క‌డుతున్న న‌య‌న‌తార‌!

న‌య‌న‌తార న‌టిస్తున్న లేటెస్ట్ సినిమా టెస్ట్. ఆర్‌.మాధ‌వ‌న్‌, సిద్ధార్థ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా మూవీ ఇది. శ‌శికాంత్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. టెస్ట్ మూవీ మోష‌న్ పోస్ట‌ర్‌ని మేక‌ర్స్ రివీల్ చేశారు. షూటింగ్ ప్రోగ్రెస్‌లో ఉంద‌ని అనౌన్స్ చేశారు.మోష‌న్ పోస్ట‌ర్‌ని బ‌ట్టి టెస్ట్ మూవీ స్పోర్ట్స్ డ్రామా అని క‌న్‌ఫ‌ర్మ్ చేసిన‌ట్టు అయింది. క్రికెట్ స్టేడియంలో ఒక‌రు బాల్ వేయ‌గా, మిగిలిన వాళ్లు విజిల్స్ వేయడం, ఛీర్స్ కొట్ట‌డం వినిపిస్తోంది మోష‌న్ పోస్ట‌ర్‌లో. ఇప్ప‌టికే ఈ స్టోరీ లైన్ మీద ఆడియ‌న్స్ లో బ‌జ్ ఏర్ప‌డింది. ఈ సినిమా గురించి మ‌రిన్ని వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని ప్ర‌క‌టించారు మేక‌ర్స్ .

ముంబైలో స్టెప్పులేస్తున్న జ‌వాన్‌

ప‌ఠాన్ సక్సెస్ త‌ర్వాత క్లౌడ్ నైన్‌లో ఉన్నారు షారుఖ్ ఖాన్‌. ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా నెక్స్ట్ సినిమాకు సంబంధించిన ప‌నులు కంప్లీట్ చేస్తున్నారు. ఆయ‌న ప్ర‌స్తుతం జ‌వాన్ షూటింగ్ పూర్తి చేస్తున్నారు. అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా జ‌వాన్‌. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. విజ‌య్ సేతుప‌తి, ప్రియ‌మ‌ణి కీ రోల్స్ చేస్తున్నారు. దీపిక ప‌దుకోన్ కూడా ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపిస్తున్న‌ట్టు వినికిడి. సౌత్ నుంచి ఓ స్టార్ హీరో గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇస్తార‌ని కూడా మాట‌లు వినిపిస్తున్నాయి. గ‌త కొన్నాళ్లుగా జ‌వాన్‌కి సంబంధించిన షూటింగ్ చేస్తున్నారు మేక‌ర్స్. అందులో భాగంగా ప్ర‌స్తుతం ముంబైలో సాంగ్ షూట్ జ‌రుగుతోంది. ఫ‌రాఖాన్ నేతృత్వంలో పాట చిత్రీక‌రణ జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం. 

స‌మంత రియ‌ల్ వారియ‌ర్ అంటున్న క‌బీర్‌!

క‌బీర్ దుహాన్ సింగ్ చెబుతున్న కొన్ని మాట‌లు స‌మంత అభిమానుల‌కు స‌రికొత్త ఉత్సాహాన్నిస్తున్నాయి. జీవితంలో చిన్న చిన్న వాటికే ఇబ్బందిప‌డుతున్న చాలా మందిలో ఆశ‌ల్ని నింపుతున్నాయి. స‌మంత న‌టించిన లేటెస్ట్ సినిమా శాకుంత‌లం. దేవ్‌మోహ‌న్ హీరోగా న‌టించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్, గుణ టీమ్ వ‌ర్క్స్ సంయుక్తంగా నిర్మించారు. దిల్‌రాజు స‌మ‌ర్పిస్తున్నారు. నీలిమ గుణ నిర్మాత‌. ఈ సినిమాకు గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ నెల 14న విడుద‌ల కానుంది శాకుంత‌లం. కొంత‌మందికి ప్రీమియ‌ర్ షోలు వేశారు. నెట్టింట్లో మిశ్ర‌మ స్పందన క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో స‌మంత‌తో ప‌నిచేయ‌డం గురించి, శాకుంత‌లం సినిమా గురించి చాలా విష‌యాల‌ను షేర్  చేసుకున్నారు క‌బీర్ దుహాన్ సింగ్‌. త‌మిళ్‌, తెలుగు, క‌న్న‌డ‌లో చాలా సినిమాల‌కు ప‌నిచేసిన‌ప్ప‌టికీ, ఇది త‌న‌కు చాలా స్పెష‌ల్ సినిమా అని అన్నారు క‌బీర్‌సింగ్‌.

కార్తిక్ - క‌ర‌ణ్ క‌లిసిపోయిన‌ట్టేనా?

కార్తిక్ ఆర్య‌న్‌, క‌ర‌ణ్ జోహార్ ఇద్ద‌రూ క‌లిసిపోయిన‌ట్టేనా?  వారిద్ద‌రి మ‌ధ్య అంతా స‌వ్యంగానే ఉందా? ఇప్పుడు బాలీవుడ్‌లో జ‌రుగుతున్న డిస్క‌ష‌న్ అంతా దీని గురించే. అందుకే వీరిద్ద‌రి పేర్లు హెడ్‌లైన్స్ లో మారుమోగుతున్నాయి. ముంబైలోని ఓ ఖ‌రీదైన భ‌వనం నుంచి కార్తిక్ ఆర్య‌న్‌, క‌ర‌ణ్ జోహార్ బ‌య‌ట‌కు వెళ్ల‌డంతో వారిద్ద‌రి మ‌ధ్య అంతా ప‌ర్ఫెక్ట్ గా ఉంద‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. దోస్తానా 2 నుంచి కార్తిక్ ఎగ్జిట్ అయ్యాడ‌నే మాట‌ల‌కు ఇప్పుడు ఫుల్‌స్టాప్ ప‌డ్డ‌ట్ట‌యింది. దోస్తానా 2 ఆగిపోయింద‌ని,క‌ర‌ణ్ జోహార్‌తో చెడ‌టం వ‌ల్ల‌నే ఆ ప్రాజెక్ట్ నుంచి కార్తిక్ త‌ప్పుకున్నార‌ని చాలా వార్త‌లువ‌చ్చాయి. అయితే కార్తిక్‌గానీ, క‌ర‌ణ్‌గానీ దీని గురించి ఎప్పుడూ పెద‌వి విప్ప‌లేదు. అయితే, ఇప్పుడు వీరిద్ద‌రూ క‌లిసింది దేనికోసం?  దోస్తానా 2 చేస్తారా?  లేకుంటే, దాన్ని ప‌క్క‌న పెట్టి సరికొత్త ప్రాజెక్టును టేక‌ప్ చేస్తారా? అనేది కూడా ఆలోచించాల్సిన విష‌యం.