English | Telugu
ఎండలు ముగిసాక వస్తున్న ‘ఐస్క్రీమ్’
Updated : Jul 3, 2014
ఈ నెల 11న ‘ఐస్క్రీమ్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఫ్లో క్యాం టెక్నాలజీతో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు రెడీగా వుంది. ఈ చిత్రానికి సంబంధించిన 20 నిమిషాల వీడియోని ప్రదర్శించిన అనంతరం, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ, పెద్ద హీరోల చిత్రాలకు తప్ప మిగతా చిత్రాలకు ఆదాయంలేని ఈ టైంలో టేబిల్ ప్రాఫిట్ తో సినిమా విడుదల చేయటం ఆనందంగా వుందన్నారు. ఈ క్రెడిట్ అంతా రాంగోపాల్ వర్మకే చెందుతుందన్నారు.
ఈ చిత్రంలో వాడిన ఫ్లో క్యాం తననెంతో ఆశ్చర్యపరిచిందని, రాబోయో రోజుల్లో సినీమా హిస్టరీలో విప్లవాలు తీసుకువస్తుందని రాంగోపాల్ వర్మ అన్నారు. ఈ టెక్నాలజీ ప్రతినిధులు అరుణ్, శేష్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రం తప్పకుండా గొప్ప విజయం సాధించే అవకాశం వుందని కార్యక్రమంలో పాల్గొన్న శివనాగేశ్వరరావు, మధుర శ్రీ్ధర్, విజయేందర్ రెడ్డి అన్నారు. నవదీప్, తేజస్వీ నటించిన ఐస్క్రీం చిత్రం ట్రెయిలర్ విడుదల అయినప్పటి నుండి ప్రతి నోటా నానుతూనే వుంది. ఈ సినిమా విజయం సాధిస్తే రామ్ గోపాల్ వర్మ మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయినట్లేనని భావించవచ్చేమో.