English | Telugu

అన్నదమ్ముల మధ్య యుద్ధం.. గెలుపెవరిది..?

సౌత్ లో అనతి కాలంలోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు లోకేష్ కనగరాజ్. ఇక లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి ఆడియన్స్ లో ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. అందునా 'ఖైదీ'లో కార్తి పోషించిన ఢిల్లీ పాత్రకి, 'విక్రమ్' క్లైమాక్స్ లో సూర్య సందడి చేసిన రోలెక్స్ పాత్రకి విపరీతమైన అభిమానులున్నారు. అలాంటిది ఈ ఇద్దరు తలబడితే ఎలా ఉంటుంది?. త్వరలోనే అది సాధ్యం కాబోతుంది.

లోకేష్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'కూలీ' ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టింది. డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టడం విశేషం. దీని తర్వాత 'ఖైదీ-2' చేయనున్నాడు లోకేష్. ఢిల్లీ వర్సెస్ రోలెక్స్ అన్నట్టుగా ఈ చిత్ర కథ ఉంటుందని తెలుస్తోంది.

నిజ జీవితంలో సూర్య, కార్తి అన్నదమ్ములు అనే విషయం తెలిసిందే. అలాంటిది ఈ ఇద్దరు స్క్రీన్ పై ఢీ అంటే ఢీ అన్నట్టుగా తలపెడితే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా ఇప్పటికే రోలెక్స్ గా సూర్య, ఢిల్లీగా కార్తి ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. మరి ఇద్దరి పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.