English | Telugu

రాజమౌళి "ఈగ" కి మళ్ళీ సెంథిల్

రాజమౌళి దర్శకత్వంలోని "ఈగ" చిత్రానికి మళ్ళీ సెంథిల్ కుమార్ కెమెరామేన్ గా వచ్చారు. ఈ "ఈగ" చిత్రానికి ముందుగా జేమ్స్ పౌల్ ని కెమెరామేన్ గా ఎన్నుకున్నారు.కానీ రాజమౌళి వర్కింగ్ స్టైల్ కి అతనికీ కుదరక పోవటంతో సెంథిల్ కుమార్ నే రాజమౌళి రమ్మని కబురు పంపారట. రాజమౌళి, సెంథిల్ కుమార్ కాంబినేషన్ లో గతంలో ఛత్రపతి, యమదొంగ, మగధీర వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు వచ్చాయి. అదీ గాక ఆ మధ్య కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క నటించగా వచ్చిన "అరుంధతి" చిత్రానికి కూడా సెంథిల్ కుమార్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ నిర్వహించారు.

రాజమౌళి "ఈగ" చిత్రంలో గ్రాఫిక్స్ అధికంగా ఉండటం, సెంథిల్ గతంలో రాజమౌళితో పనిచేసి ఉండటం వల్లా, రాజమౌళికి ఏం కావాలో సెంథిల్ తేలికగా గ్రహించగలడని, ఆ విధమగా రిజల్ట్ అందించగలడని "ఈగ" చిత్రానికి రాజమౌళి మళ్ళీ సెంథిల్ నే తీసుకోవటం జరిగిందట. మరి రాజమౌళి, సెంథిల్ కాంబినేషన్ లో రాబోతున్న "ఈగ" చిత్రం విజువల్ ఫీస్ట్ అవుతుందనటంలో సందేహం అక్కర్లేదు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.