టీడీపీ ఎం ఎల్ సి, చంద్రబాబు నాయుడి అనుంగు అనుచరుడు అయిన బుద్ధ వెంకన్న కు గురువారం సాయంత్రం నుంచీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆ విషయం ఆయనే ఒక లేఖ ద్వారా వెల్లడించారు. పాత్రికేయ మిత్రులను ఉద్దేశిస్తూ రాసిన ఈ లేఖలో ఆయన -జగన్మోహన్ రెడ్డిని, విజయసాయి రెడ్డి ని దుమ్మెత్తి పోశారు. ప్రజాస్వమ్యం లో ఈ తరహా బెదరింపు ధోరణులు సరి కాదని, ప్రభుత్వం తన కక్ష పూరిత ధోరణిని విడనాడాలని, చంద్రబాబును ఎవరైనా ఏమైనా అనొచ్చు కానీ, తాము మాత్రం ప్రభుత్వ దుర్మార్గాన్ని ప్రశ్నించ కూడదా అని బుద్ధా వెంకన్న నిలదీశారు. మాచర్లలో తనపై జరిగిన హత్యా యత్నాన్ని గుర్తు చేసిన వెంకన్న, ఈ రోజు బెదరింపు కాల్స్ కి భయపడేది లేదని తేల్చి చెప్పారు.