English | Telugu
ఎల్జీ పాలిమర్స్కు సుప్రీం కోర్టులో చుక్కెదురు
Updated : May 19, 2020
ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాల మేరకు రూ.50 కోట్లు జమ చేశామని, అంతకుమించి ఎన్జీటీకి విచారణ అధికారం లేదని ఎల్జీ పాలిమర్స్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న జస్టిస్ లలిత్ ధర్మాసనం తదుపరి విచారణను జూన్ 8కి వాయిదా వేసింది. అంతేగాకుండా, ఎన్జీటీలో న్యాయపరమైన అంశాలు లేవనెత్తేందుకు అవకాశం కల్పించింది.
ఎన్జీటీ, ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టులో ఎల్జీ పాలిమర్స్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గ్యాస్ లీక్ ఘటన జరిగిన వెంటనే ఎన్జీటీ ఎల్జీ పాలిమర్స్ పై చాలా సీరియస్ అయింది. నోటీసులు ఇవ్వడంతో పాటు రూ.50 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలపై ఎల్జీ పాలిమర్స్ సుప్రీం కోర్టు కు వెళ్ళింది. తమ వాదనలు వినకుండా ఏకపక్షంగా ఆదేశాలు ఇవ్వడాన్ని ఎల్జీ పాలిమర్స్ సవాల్ చేసింది.