English | Telugu

గాడ్సే నిజమైన దేశభక్తుడు: నాగబాబు

జాతిపిత మహాత్మా గాంధీని 1948 జనవరి 30 న నాధురాం గాడ్సే హత్య చేసిన సంగతి తెలిసిందే. సత్యం, అహింసని ఆయుధాలుగా మలుచుకొని స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీ వంటి వ్యక్తిని చంపడం భారతీయులు జీర్ణించుకోలేకపోయారు. ఇప్పటికీ గాడ్సే అనే పేరు వింటే గాంధీని చంపిన హంతకుడనే భారతీయుల మెదళ్ళకు తడుతుంది. అయితే, గాంధీని ఆరాధించే ఈ దేశంలో.. గాడ్సే నిజమైన దేశ భక్తుడు అంటూ అభిమానించే వారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో నటుడు, జనసేన నేత నాగబాబు కూడా చేరిపోయారు. ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు. ఆయన నిజమైన దేశ భక్తుడు అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.

"ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది debatable. కానీ అతని వైపు ఆర్గ్యుమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే). గాంధీ ని చంపితే ఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు. కానీ నాధురాం దేశభక్తి ని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవలనిపించింది. పాపం నాధురాం గాడ్సే... మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్." అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.

కాగా, నాగబాబు ట్వీట్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు కూడా నాగబాబు ట్వీట్ ని తప్పుబడుతున్నారు.