English | Telugu
నిర్మల్లో మర్కజ్ ప్రకంపనలు...
Updated : Apr 13, 2020
కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతూనే ఉండటంతో పల్లె వాసుల్లో ఆందోళన ఎక్కువైంది. వైరస్ తమను చేరకుండా ఉండాలని నిర్ణయించుకొని వారు ఊర్లకు సైతం దూరంగా వెళ్లిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కొంత మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోతున్నారు. మరొ కొంత మంది తమ పంట పొలాల్లో తాత్కాలికంగా టెంట్లు వేసుకొని అక్కడే నివాసం ఉంటున్నారు.