English | Telugu
అమ్మ వయస్సు ఉన్న వారిని కూడా వేధిస్తున్నారు
Updated : May 19, 2020
రంగనాయకమ్మపై కేసు నమోదు చేయడం పట్ల టీడీపీ నేత నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. "అమ్మ వయస్సు ఉన్న వారిని కూడా కక్షగట్టి, వెంటాడి వేధిస్తున్నారు. ప్రమాదకరమైన స్టెరీన్ గ్యాస్ లీకేజ్ తో అమాయకుల ప్రాణాలు బలిగొన్న కంపెనీ ప్రతినిధుల్లో ఒక్కరిని కూడా అరెస్ట్ చెయ్యలేదు." అని లోకేష్ విమర్శించారు.
"ప్రమాదంలో చిన్నారిని కోల్పోయిన బాధలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తల్లిదండ్రులను అరెస్ట్ చేసి అదో గొప్ప కంపెనీ అంటూ కితాబిచ్చారు జగన్. గ్రామస్తులు లేవనెత్తిన ప్రశ్నలనే సోషల్ మీడియా లో పోస్ట్ చేసినందుకు రంగనాయకమ్మ గారి పై కేసు పెడతారా?. " అని లోకేష్ ప్రశ్నించారు.
"66 ఏళ్ల వృద్ధురాలు పై కేసు పెట్టడం వైకాపా ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం.మీ లెక్క ప్రకారమే ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు 5 ఏళ్ల జైలు శిక్ష అయితే. 43 వేల కోట్ల ప్రజల సొమ్ము కొట్టేసిన జగన్ గారికి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష వెయ్యాలి?" అని లోకేష్ జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.