English | Telugu
వైసీపీ ఎమ్మెల్యేతో సమావేశమైన ఎమ్మార్వోకు కరోనా!!
Updated : Apr 14, 2020
ఇప్పటికే ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల సిబ్బందిని క్వారంటైన్కు తరలించారు. ప్రస్తుతం వారందరూ వైద్యుల సమక్షంలో క్వారంటైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఈ తహసీల్దార్ మడకశిర వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామితో పలుసార్లు సమావేశమయ్యారని తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే అనుచరుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, ఈ వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే ఇంతవరకూ స్పందించలేదు.