English | Telugu
ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలులో అక్రమాలు జరగలేదు: కాటంనేని భాస్కర్
Updated : Apr 19, 2020
కరోనా బాధితుడికి.. ఆ వైరస్ ఎక్కడ నుంచి సోకిందో తెలియకుంటే కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ ఉన్నట్టే అని ఆయన స్పష్టం చేశారు. సుమారు 40 కేసుల్లో వైరస్ ఎక్కడి నుంచి సోకిందో ట్రేస్ కావడం లేదని, మెడికల్ షాపుల నుంచి సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. దగ్గు, జలుబు, జ్వరానికి ఎవరికైనా మందులిస్తే వారి వివరాలు చెప్పాలని మెడికల్ షాప్ కీపర్లను కోరామన్నారు. కొన్ని నెలల్లో వాక్సిన్ వచ్చే అవకాశం ఉందని, కరోనాకు మందులు.. వాక్సిన్ వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాల్సిందేనని కాటంనేని భాస్కర్ సూచించారు. ప్రస్తుతం టెస్టుల సంఖ్య 5 వేలుగా ఉందని, ఎనిమిది ల్యాబులు ఉన్నాయి.. ట్రూనాట్ పరికరాల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని, చైనా నుంచి వచ్చే కిట్ల విషయంలో ఆ దేెశం విధించిన కొన్ని నిబంధనలు అడ్డుగా ఉన్నాయని, త్వరలో 10-12 వేల మేర టెస్టుల సామర్ద్యం పెంచుకుంటామని చెప్పారు.