English | Telugu
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కరోనా పేషెంట్!
Updated : May 9, 2020
సదరు మహిళ కరోనాతో పాటు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతోంది. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని... చిన్నారిని వేరుగా ఉంచినట్టు డాక్టర్లు వివరించారు. చిన్నారి స్వాబ్ సేకరించి.. పరీక్షల కోసం పంపినట్టు తెలిపారు. అరుదైన ఈ ఘనతను సాధించిన వైద్యులను మంత్రి ఈటల అభినందించారు. అయితే ఈ మహిళ కుటుంబంలో అందరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. వారందరూ గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.