ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 8,092 శాంపిల్స్ను పరీక్షించగా 45 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,452కి చేరుకుంది. నెల్లూరు జిల్లాలో ఒకరు మృతి చెందగా.. కరోనాతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 54కి చేరింది. కొత్తగా 41 మంది కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు మొత్తం 1,680మంది కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 718 మంది చికిత్స పొందుతున్నారు.