English | Telugu

తెలంగాణాలో మే 7వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగింపు!

తెలంగాణాలో సంపూర్ణ లాక్‌డౌన్ అమ‌లు అవుతుంది. ఏప్రిల్ 20వ తేదీ నుంచి కేంద్రం ప్ర‌క‌టించిన‌ స‌డ‌లింపులు తెలంగాణాలో అనుమ‌తించమ‌ని ముఖ్య‌మంత్రి కేసిఆర్ స్ప‌ష్టం చేశారు. ఏప్రిల్ 30 వ‌ర‌కు తెలంగాణా ప్ర‌భుత్వం లాక్‌డౌన్ కొన‌సాగాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఆ త‌రువాత కేంద్రం మే 3వ తేదీ వ‌ర‌కు వుండాల‌ని చెప్పింది. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని స‌ర్వేలు చేయించాం. 92 శాతం లాక్‌డౌన్ పొడిగించాల‌ని వ‌చ్చింది. ఈ అభిప్రాయాల్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణాలో లాక్‌డౌన్‌ను మే 7వ తేదీ వ‌ర‌కు పెంచాల‌ని ఈ రోజు స‌మావేశ‌మైన తెలంగాణా క్యాబినెట్ నిర్ణ‌యించిన‌ట్లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. గ‌తంలో వున్న నిబంధ‌న‌లే వుంటాయ‌ని సిఎం తెలిపారు.