English | Telugu

టెన్త్, ఇంటర్‌ పరీక్షలు రద్దు.. అందరూ పాస్!!

టెన్త్, ఇంటర్ పరీక్షలపై ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్, ఇంటర్‌ విద్యార్థులను పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంటర్నల్‌ పరీక్షల్లో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకొని, పై చదువులకు ప్రమోట్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కరోనా వైరస్‌ విభృంభిస్తున్న తరుణంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం అంత శ్రేయస్కరం కాదు. మరోవైపు, కొత్త విద్యా సంవత్సరానికి కూడా సమయం దగ్గర పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు, ఫలితాలకు చాలా సమయం పట్టొచ్చు. అదే జరిగితే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. ఈనేపథ్యంలోనే ఇదివరకు రాసిన ఇంటర్నల్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఆధారంగా ప్రమోట్‌ చేయాలని ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. మరోవైపు, ఇదే దారిలో పంజాబ్‌ ప్రభుత్వం కూడా వెళ్లే అవకాశముందని తెలుస్తోంది.