English | Telugu

ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు...

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపించిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో మరో 36 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2100​కి చేరింది. ఇప్పటి వరకు 1192 మంది డిశ్చార్జ్‌ కాగా, 48 మంది మరణించారు. ప్రస్తుతం 860 మంది చికిత్స పొందుతున్నారు.

కాగా గడిచిన 24 గంటల్లో 9256 శాంపిల్స్‌ పరీక్షించగా.. 68 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 32 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఇక గడిచిన 24 గంటల్లో 52 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.