English | Telugu
టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం: చంద్రబాబు
Updated : May 28, 2020
రాజకీయాల్లో ఎన్టీఆర్కు ఎవరూ సాటిలేరని, ఆయన పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారని అన్నారు. పేద ప్రజల కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని, మహిళలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించారని అన్నారు. పేదలకు పట్టెడన్నం పెట్టడమే తన సిద్ధాంతమని ఎన్టీఆర్ చెప్పేవారని తెలిపారు. సామాజిక న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. తెలుగుదనానికి నిలువెత్తు రూపం ఎన్టీఆర్. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాగా, ఎన్టీఆర్ జయంతి కావడంతో చంద్రబాబుతో పాటు పలువురు ముఖ్యనేతలు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. అలాగే, ఎన్టీఆర్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలంటూ మహానాడులో టీడీపీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.