English | Telugu
బస్తాకు రూ.70వరకూ పెరిగిన సిమెంటు ధర!
Updated : May 11, 2020
గతంలో రూ.250 ఉన్నది ఇప్పుడు రూ.320కి, గతంలో రూ.300 ఉన్న బ్యాగ్ ఇప్పుడు రూ.370 అయింది. దూరాభారాన్ని బట్టి దాదాపు రూ.400కు కూడా చేరుతోంది.
ఏపీలో నిర్మాణ రంగంపై ఆధారపడిన సుమారు 20 వృత్తుల వారు దాదాపు 40లక్షల మంది ఉన్నారని అంచనా. ఇంతమందికి ఉపాధి కల్పించాల్సిన నిర్మాణదారులు బేలచూపులు చూస్తున్నారు. మోయలేనంత భారంగా ఉన్నా ప్రాజెక్టులు పూర్తిచేద్దామని అనుకున్నవారు.... ధరల పెరుగుదలతో మరింత బెంబేలెత్తిపోతున్నారు. కరోనా కారణంగా సుమారు 50రోజులు సిమెంటు అమ్మకాలే లేవు. నిర్మాణ రంగం మొత్తం స్తంభించిపోయింది.
కరోనాకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇసుకకు ధర పెట్టడం, ఇసుక కొరతతో పెరిగిన ధరలు, మూడు రాజధానుల నిర్ణయంతో ఎక్కడికక్కడ అమ్మకాలు నిలిచిపోవడంతో నిర్మాణ దారులు కుదేలయ్యారు. చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అప్పులు చేయాల్సి రావడం, వాటికి పెరుగుతున్న వడ్డీలు.. ఇవన్నీ పడలేక కొందరు హైదరాబాద్కు తరలిపోయారు. మరికొందరు అసలు ఈ రంగమే వదిలేశారు.
అన్ని రకాలుగా ఇబ్బందుల్లో చిక్కుకున్న నిర్మాణదారులను ఆదుకోవడానికి రాయితీలు ఇవ్వడం, వీలైతే ధరలు తగ్గేలా ప్రభుత్వం చూడాల్సి ఉంది. కానీ దీనికి రివర్స్లో ధరలు పెరగడంతో నిర్మాణదారులు హతాశులవుతున్నారు.