English | Telugu
స్టైరీన్ ప్రభావిత గ్రామాల్లో బస చేయండి! మంత్రులకు సి.ఎం. ఆదేశం!
Updated : May 11, 2020
వైద్య సేవల్లో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలన్నారు. సోమవారం ఉదయం మంత్రులు, అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించాలని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందజేయాలని పేర్కొన్నారు. పారదర్శకంగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. ఆర్థిక సాయం అందలేదని బాధితులెవరూ విజ్ఞాపనలు చేసే పరిస్థితి ఉండకూడదని సీఎం పేర్కొన్నారు. స్టైరీన్ రసాయనం విశాఖలో ఉంచడానికి వీల్లేదని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. గ్యాస్ లీక్ ప్రాంతాల్లో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందని సీఎంకు అధికారులు వివరించారు.