English | Telugu
సీఎస్ విషయంలో జగన్ కీలక నిర్ణయం.. కేంద్రానికి లేఖ!
Updated : May 13, 2020
కరోనా విపత్తు నేపథ్యంలో పదవి విరమణ చేసే అధికారులకు పలువురికి 3 నెలల వరకు పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. అదే విధంగా నీలం సాహ్ని పదవీ కాలాన్ని కూడా పొడిగించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో కూడా సీఎస్ పదవీకాలాన్ని పొడిగించిన సందర్భాలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత అప్పటి పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అప్పటి ఉమ్మడి ఏపీ సీఎస్ రమాకాంత్ రెడ్డి పదవీకాలాన్ని 3 నెలల పాటు పొడిగించింది. అలాగే, 2014లో రాష్ట్ర విభజన సమయంలో పీకే మహంతీ పదవీకాలాన్ని 4 నెలల పాటు పొడిగించింది. కరోనా నేపథ్యంలో ఇప్పుడు కూడా అలాగే సీఎస్ పదవీకాలాన్ని పొడిగించే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ అంశంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.