English | Telugu

హోమ్ క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన ఆరు నెలల శిశువు!

బ్రహ్మం గారు బహుశా ఈ విషయం కూడా చెప్పే ఉంటారు, లేకపోతె, ఉత్తరాఖండ్ పోలీసులు ఎందుకలా చేస్తారు? ఆ రాష్ట్రంలో కరోనా లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ ఉల్లంఘలనకు పాల్పడితే కేసులు నమోదు చేస్తున్నారు. అయితే, పాలుతాగే పసికందులపైనా లాక్ డౌన్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా, ఉత్తరకాశీ జిల్లాలో 51 మందిపై హోం క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసులు నమోదు చేయగా, వారిలో 6 నెలల శిశువు, మూడేళ్ల వయసున్న చిన్నారులు కూడా ఉన్నారు.

ఈ వ్యవహారంలో రాష్ట్ర అధికారులపై విమర్శలు వస్తున్నాయి. బాలనేరస్తుల చట్టం ప్రకారం 8 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న చిన్నారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయరాదు. ఈ ఘటనపై విచారణకు ఆదేశాలిచ్చామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. జిల్లా కొవిడ్-19 అధికారిని తప్పించడంతో సహా ఇతర క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు.