English | Telugu

ప్లాస్మా థెరపీ ఫలితాలు బావున్నాయి: కేజ్రీవాల్ 

ఢిల్లీలో నలుగురు రోగులకు అందించిన ప్లాస్మా చికిత్స ప్రయోగం ఫలితాలు ఆసాజనకంగా ఉన్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీ మంగళవారం ఈ ప్రయోగాలు ప్రారంభించింది. కరోనా వచ్చి కోలుకున్న రోగుల రక్తంలోని ప్లాస్మా సేకరించి కరోనా రోగులకు ఎక్కించడమే ప్లాస్మా చికిత్స. 'గత కొద్దిరోజులుగా లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్‌లో నలుగురు రోగులకు ప్లాస్మా థెరపీ మొదలుపెట్టాం. ఇప్పటివరకైతే ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి' అని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత మందికి ప్లాస్మా థెరపీ జరిపిస్తామని ఆయన చెప్పారు. పరిమిత స్థాయిలో పరీక్షలకు కేంద్రం అనుమతి ఇచ్చిందని వివరించారు. తీవ్రంగా జబ్బుపడ్డ అందరికీ విస్తృతస్థాయిలో ఈ చికిత్స జరిపేందుకు వచ్చేవారం కేంద్రం అనుమతి కోరుతామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కరోనా నుంచి కోలుకున్నవారు అందరూ ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇన్‌స్టిట్యూట్ ఆప్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ సహకారంతో ఈ ప్రయోగాలు జరుపుతున్నారు. ఆ సంస్థ కరోనా రోగుల నుంచి సేకరించిన రక్తం నుంచి ప్లాస్మాను వేరు చేసి ఇస్తుంది.