English | Telugu

27 న మరో సారి మోడీ- సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ 

కరోనా కట్టడి కోసం మే 3 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన ప్రధాని మోదీ ప్రస్తుతం కరోనా పరిస్థితులపై మరోసారి రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ నెల 27 న సమావేశం కానున్నారుఉంది. అలాగే ఆ తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించే అవకాశం . సోమవారం ఉదయం ముఖ్యమంత్రులతో మోదీ భేటీ నిర్వహిస్తారు. ఏప్రిల్ 20 తర్వాత దేశంలోని పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ నిబంధనల్లో సడలింపునిచ్చిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ అమలవుతున్న తీరు, తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో చర్చించే అవకాశం ఉంది.

ఏప్రిల్ 11న కూడా ప్రధాని మోదీ 13 రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రాల సీఎంలు లాక్‌డౌన్‌ను పొడిగించాలని ప్రధాని మోదీని అభ్యర్థించారు. దీంతో ఏప్రిల్ 30 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగిస్తారని భావించారు. కానీ అనూహ్యంగా మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు మోదీ ప్రకటించారు.దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించే ముందు కూడా ప్రధాని మోదీ రాష్ట్రాల సీఎంలతో భేటీ అయ్యారు. ఏప్రిల్ 2న కూడా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.