పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో ఏపీకి షాక్ తగిలింది. పోతిరెడ్డిపాడు పథకంపై ఎన్జీటీ స్టే విధించింది. పోతిరెడ్డిపాడుపై నారాయణపేటకు చెందిన శ్రీనివాస్ ఎన్జీటీలో ఫిర్యాదు చేయగా, జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. పర్యావరణ ప్రభావంపై అధ్యయనం చేయడానికి నాలుగు శాఖల సభ్యులతో ఎన్జీటీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ, కాలుష్య నియంత్రణ మండలితో పాటు, ఐఐటీ హైదరాబాద్కు చెందిన ప్రొపెసర్లకు కమిటీలో స్థానం కల్పించారు. రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని ఎన్జీటీ ఆదేశించింది. కమిటీ నివేదిక వచ్చేవరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని ఎన్జీటీ సూచించింది.