ప్రపంచ తెలుగు కార్మికులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ట్విటర్ ద్వారా మే డే శుభాకాంక్షలు తెలిపారు. ‘‘కార్మికుల శ్రమ దేశ సంపద సృష్టికి మూలం. కార్మికుల స్వేదం, రక్తంతోపాటు వారి జీవితాలను ధారబోయడం వల్లే ప్రపంచ పురోగతి, ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధ్యమవుతోంది. మే ఒకటో తేదీ కార్మిక పోరాట స్ఫూర్తి, చైతన్యానికి ప్రతీక. మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కార్మికులకు శుభాకాంక్షలు’’ అని జగన్ ట్వీట్ చేశారు.