English | Telugu

చంద్రబాబు పై జగన్ సీబీఐ అస్త్రం

ఏపీలో చంద్రబాబు అధికారం లో ఉన్నపుడు ప్రభుత్వ పథకాలలోను, అమరావతి భూముల విషయంలోనూ భారీగా అవినీతి జరిగిందని అప్పటి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఏడాది క్రితం వైసిపి అధికారం లోకి వచ్చిన తరువాత ఈ అవినీతి ఆరోపణల నిగ్గు తేల్చి చర్యలు తీసుకుంటారని అందరూ ఆశించారు. ఐతే వైసిపి నాయకులు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవని.. అవే ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఇలా ఉంటే గత టీడీపీ ప్రభుత్వ హయాం లో జరిగిన అవినీతి అంతు తేల్చడం కోసం అంటూ కొద్ది నెలల క్రితం జగన్ ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ని ఏర్పాటు చేసింది. ఈ రోజు జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశం లో ఆ సబ్ కమిటీ తన రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఈ రిపోర్ట్ లో ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ లో 700 కోట్లు, పండుగల సందర్బం గా ఇచ్చిన చంద్రన్న కానుక లో 158 కోట్లు మరియు హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల కొనుగోళ్లలో కూడా అవకతవకలు జరిగాయని పేర్కొంది. దీని పై చర్చించిన మంత్రివర్గం ఈ అవినీతి ఆరోపణల పై సిబిఐ దర్యాప్తు జరిపించాలని నిర్ణయించింది.